ప్రకాశం జిల్లా గ్రామీణ విలేఖరులకు పునశ్చరణ తరగతులు

ప్రకాశం జిల్లా గ్రామీణ విలేకరుల కోసం ఆగష్టు 30, 31 తేదీలలో మార్కాపురంలో పునశ్చరణ తరగతులు నిర్వహించనున్న సి.ఆర్.మీడియా అకాడమీ. క్రైమ్ రిపోర్టింగ్, ఫ్యాక్ట్ చెక్, పత్రికా భాష, AI వంటి అంశాలపై సీనియర్ జర్నలిస్టుల శిక్షణ.

మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనలో కీలక పరిణామాలు – పోస్టులపై అయోమయం, అధికారుల వివరణ

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు ఖాళీ అవుతున్నాయి. రిజర్వేషన్లలో మార్పులు, 600 మంది వరకు తిరస్కరణ అవకాశం. విద్యాశాఖ త్వరలో ఎంపిక జాబితా విడుదల చేయనుంది.

అమరావతిపై దుష్ప్రచారం తగదు – సదస్సులో నిపుణులు, మేధావుల స్పష్టం

అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగజేస్తోందని నిపుణులు, మేధావులు సదస్సులో స్పష్టం చేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో అబద్ధపు ప్రచారం చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని, అమరావతికి చారిత్రక ప్రాధాన్యం ఉందని నిపుణులు గుర్తుచేశారు.

గుంటూరులో వర్షాల దెబ్బ: అరండల్‌పేట రోడ్లపై కండోమ్‌లు.. ప్రజలకు షాక్!

గుంటూరులో వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం. అరండల్‌పేట రోడ్లపైకి కండోమ్‌లు కొట్టుకొచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. లాడ్జిపై పోలీసుల చర్యలపై ప్రశ్నలు లేవుతున్నాయి

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు – కృష్ణమ్మ ఉగ్రరూపం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తుండగా, లోతట్టు గ్రామాలు ముంపు ముప్పులో ఉన్నాయి. అధికారులు అప్రమత్తం చేస్తూ పునరావాస ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వినాయక చవితి సందేశం – రాష్ట్ర సుభిక్షత, ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ఏపీ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్, అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలు, అలాగే సెప్టెంబర్ 6న అనంతపురంలో జరగనున్న “సూపర్-6 సూపర్ హిట్ సభ” వివరించారు.

ఐఏఎస్ శ్రీలక్ష్మి – విజయాల నుండి వివాదాల వరకు ఒక గాథ

21 ఏళ్లకే సివిల్స్ టాపర్ అయిన ఐఏఎస్ శ్రీలక్ష్మి, తరువాత వివాదాలు, జైలు జీవితం, అమరావతి వివాదంలో పాత్ర, రాజకీయ సంబంధాలు, కోర్టు కేసులతో కెరీర్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై పూర్తి విశ్లేషణ.

విజయవాడ పశ్చిమ బైపాస్ పనులు వేగంగా – సంక్రాంతికల్లా పూర్తి లక్ష్యం

విజయవాడ పశ్చిమ బైపాస్ పనులు వేగంగా సాగుతున్నాయి. హైటెన్షన్ టవర్ మార్పిడి, ల్యాండింగ్ పనులు డిసెంబర్ చివరికి పూర్తి చేసి, సంక్రాంతికల్లా రహదారి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బైపాస్ పూర్తయితే విజయవాడ ట్రాఫిక్ తగ్గి, గంటవరకు సమయం ఆదా అవుతుంది.

అమరావతిపై అబద్ధపు ప్రచారం – భావ ప్రకటన స్వేచ్ఛ అంశంపై విజయవాడలో సెమినార్

అమరావతిపై అబద్ధపు ప్రచారం, భావ ప్రకటన స్వేచ్ఛ అంశంపై ఆగస్టు 28న విజయవాడలో సి ఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సెమినార్ జరుగుతోంది. జస్టిస్ టి. సునీల్ చౌదరి, తుంగా లక్ష్మీనారాయణ, చరిత్రకారుడు పాపినేని సాయి, రైతు జొన్నలగడ్డ కిరణ్ తదితరులు ఇందులో పాల్గొననున్నారు.

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం

ఏపీ మెగా డీఎస్సీ 2025లో క్రీడా కోటా కింద పెద్ద ఎత్తున నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. ఇప్పటివరకు 890 నకిలీ సర్టిఫికెట్లు గుర్తించిన అధికారులు, అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మెరిట్ జాబితాలో ఎంపికైన వారికి కాల్ లెటర్లు విడుదల కానున్నాయి.