రాష్ట్రంలో రాజకీయం రగులుకున్నట్లే….!జిల్లాల పర్యటనలకు జగన్ ప్రణాళికలు.

అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వేడెక్కింది. అలాగే కాకలు రేపుతోంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటనలో ప్రమాదవశాత్తు సింగయ్య అనే పార్టీ కార్యకర్త మృతి చెందడం,ఆ కే.సు జగన్ మెడకు చుట్టుకోవడంతో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే విషయం లో ప్రజల్లో రాజకీయ ఆశక్తి నెలకుంది.ఇక రాజకీయ పరిస్థితులు ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి.ఈ పరిస్థితిలో అటు టీడీపీ చేస్తున్న ప్రచారంతో ఇటు జగన్ అలర్ట్ అయ్యారు. ఈ నెల 25న పార్టీ ముఖ్య నేతల తో ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు,పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు మరియు పార్టీలో ముఖ్యమైన వారిని తాడేపల్లికి రావాల్సిందిగా ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చారని వినికిడి.జగన్ లక్ష్యంగా జరుగుతున్న రాజకీయం లో కొత్త వ్యూహంతో జగన్ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.దీని పైన పార్టీకి చెందిన ముఖ్యమైన నేతల సమావేశంలో జగన్ తాను పిలుపునిచ్చిన వారికి దిశా నిర్దేశం చేయనున్నారు.తనపై లేనిపోని వ్యవహారాలను ఉద్దేశ పూర్వకంగానే ప్రచారం చేస్తున్నారని అభి ప్రాయం తో జగన్ ఉన్నట్లు పార్టీ నేతలు కూడా చెబుతున్నారు.రాష్ట్రంలోజగన్ పర్యటనలకు బ్రేక్ వేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనేది వైసీపీ నేతల నుండి వినిపిస్తున్న వాదన. ఇకపోతే,జూలై 8వ తారీఖున వైఎస్సార్ పుట్టినరోజు నాడు వై.ఎస్, జగన్ ఇడుపులపాయ వెళ్ళే అవకాశం వుంది. బహుశా ఆ రోజు నుంచే రాష్ట్రంలో జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ నేతల నుండి అందుతున్న సమాచారం.

ఈ సమావేశంలో అన్ని విషయాలు చర్చించుకున్న అనంతరం జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారనే భావనలో వైసీపీ ముఖ్య నేతల ఆలోచన.ఏడాది కాలం పూర్తి కావటంతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను రాష్ర్టంలో ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు సమాయత్తం కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇందు కోసం సమస్యల పైన ప్రాంతాల వారీగా నిరసన కార్యక్రమాల నిర్వహించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లా స్థాయిలోనూ ప్రజా సమస్యలపై పోరుబాట నిర్వహించే విధంగా నేతలు పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలని స్థానిక సమన్వయకర్తలకు తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇవ్వడం కూడా జరిగింది.రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ నిరసన కార్యక్రమాలలో జగన్ సైతం పాల్గొనేలా మూడు ప్రాంతాలలో, మూడు కార్యక్రమాలు జరిగేలా ప్రణాళికలు రూప కల్పన చేస్తున్నారు.ఇక వరుస కేసులు,రాజకీయ విమర్శలు పెరుగుతున్న వేళ ఇక నుండి ప్రజల్లోనే ఉంటూ వాటిని తిప్పి కొట్టే వ్యూహంతో జగన్ ఉన్నారని,పార్టీ సీనియర్లు చర్చించుకుంటున్నారు.అయితే, ఇటు జగన్ పై కేసు..అటు పార్టీ నేతలతో జరగనున్న సమావేశంలో జగన్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు పరిస్థితి ఉత్కంఠగా మారుతోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి