తెలుగు సినీ పరిశ్రమకు ఏమయ్యిందో…మరి…?

అమరావతి: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొద్దిరోజులుగా నడుస్తున్న సినిమా థియేటర్లు మూసివేత, పర్సెంటేజ్ వ్యవహారాల హై డ్రామా బాగా నడుస్తుంది.గత ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీలో సమస్యలు,సినిమా టికెట్ ధరల పెంపు విషయమై కొత్త సినిమా విడుదలైన ప్రతిసారీ తాడేపల్లి వచ్చి మరీ మాజీ సీఎం జగన్ ని కలిసే ప్రయత్నం చేశారు పలువురు సినీ ప్రముఖులు.మరి ఆనాడు ఇబ్బందులు అనుకోకుండా జగన్ ని కలిసేందుకు వచ్చిన వారికి ఆయన పెద్దగా సమయం ఇచ్చిన పరిస్థితులు లేవు.కానీ ఆదివారం సీఎం చంద్రబాబుతో టాలీవుడ్ సినీ ప్రముఖుల సమావేశం జరగాల్సి ఉంది.అయితే ఈ సమావేశం వాయిదా పడింది,వాయిదా పడినట్లు శనివారం రాత్రికి అనగా లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్ వాయిదా పడింది.

అయితే,థియేటర్లలో పర్సంటేజ్ విధానం కారణంగా అటు టాలీవుడ్‌ కు-ఇటు ఏపీ ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ వచ్చిన సంగతి సినీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే…!పవన్ తన సినిమా రిలీజ్‌కు ముందు కావాలనే సినిమా థియేటర్ల బంద్ వ్యవహారం తీసుకొచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొందరు ఇండస్ట్రీ పెద్దలపై సీరియస్ అయ్యారు.అలాగే సినీ ఇండస్ట్రీకి సైతం తనదైన స్టైల్లో హెచ్చరికలు చేశారు. ఈ పరిణామాలతో టాలీవుడ్ పెద్దలు డైలమాలో పడిపోయారు.ఇక రానున్న రోజుల్లో పెద్ద సినిమాలు కొన్ని విడుదల ఉండటం తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో పరిస్థితులు ఎలా ఉంటాయనే ఆలోచనతో వాయిదా నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది.

ప్రస్తుతం టాలీవుడ్ పెద్దలకు ఏమైంది?అనే తీవ్రమైన విమర్శలు బాగా వినిపిస్తున్నాయి.సీఎం చంద్రబాబు ను కలిసే సమయం లేదా, నాడు జగన్ దగ్గరకు క్యూ కట్టారు కదా…!కారు దిగి నడిచి రమ్మంటే మహా ప్రసాదం అంటూ తలూపారు నేడు సీఎం చర్చలకు రమ్మంటే తీరిక లేదా?అనేవి తెలుస్తుండగా పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చినా లైట్ తీసుకున్నా రా…?అనే మాటలు విని పిస్తున్నాయి.వారి సినిమా రిలీజు ఉంటే మాత్రం పరిగెడతారని,10 రోజుల ముందు చంద్రబాబుతో మీటింగ్ ఉందని చెప్పినా ఎందుకు లైట్ తీసుకుంటున్నారని, ప్రభుత్వం పిలిచి నా మీనమేషాలు లెక్క పెడతారా?తాము సెమీ గాడ్స్ అనుకుంటున్నారా,మెత్తగా ఉండే వారంటే అంత చులకనా?బెదిరిస్తేనే భయ పడతారా?సినీ ఇండస్ట్రీకి ఎవరు ఏం చేశారో ఆ మాత్రం గ్రహించలేరా?ఏపీలో సినిమా ఇండస్ట్రీ ఎదగడం కొందరికి ఇష్టం లేదా?అనే తీవ్రమైన వాఖ్య లు వినిపిస్తున్నాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి