తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయడంలో భాగంగా కొత్త శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘ట్రెయిన్ ద ట్రైనీస్’ పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా సేవకుల నైపుణ్యాలను పెంపొందించి భక్తులకు ఉన్నత స్థాయి సేవలు అందించడమే లక్ష్యం. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కీలక సూచనలు చేశారు.
హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లుగా సేవకులు
తిరుమలలోని సేవా సదన్ 2లో నిర్వహించిన తొలి బ్యాచ్ శిక్షణలో గ్రూప్ సూపర్వైజర్లను సిద్ధం చేస్తున్నారు. వీరే తమ ప్రాంతాల్లో ఉన్న సేవకులకు శిక్షణ ఇచ్చి భక్తులకు మరింత మెరుగైన సేవలందించేలా మార్గనిర్దేశం చేస్తారు.
ఈ శిక్షణలో:
- వ్యక్తిత్వ వికాసం
- కమ్యూనికేషన్ నైపుణ్యాలు
- నాయకత్వ లక్షణాలు
- టీటీడీ చరిత్ర, శ్రీవారి సేవ ప్రాధాన్యత
- భక్తులతో ఆచరణ, పురాణ పరిజ్ఞానం
వంటి అంశాలను IIM అహ్మదాబాద్ నిపుణులు రూపొందించిన మాడ్యూల్ల ద్వారా బోధించనున్నారు.
ఎవరికి అవకాశం
- వయస్సు: 45 నుంచి 65 సంవత్సరాలు
- విద్యార్హత: డిగ్రీ తప్పనిసరి
- శ్రద్ధ, నిబద్ధత ఉన్నవారికి ప్రాధాన్యం
ప్రతీ బ్యాచ్లో 150 నుంచి 200 మందిని ఎంపిక చేస్తారు.
శిక్షణ పూర్తయ్యాక లభించే ప్రయోజనాలు
- అధికారిక ధృవపత్రం
- తిరుమలలో సేవా అవకాశాలు
- అత్యుత్తమ సేవకులకు ఎక్స్లెంట్ గ్రేడింగ్
- బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక వేళల్లో సేవకు ప్రాధాన్యం
అదనంగా, వైద్యులు, అధ్యాపకులు, ఇతర నిపుణులను కూడా టీటీడీ సేవల్లో భాగం చేయాలని ప్రణాళిక ఉంది.
సేవ రిజిస్ట్రేషన్ విధానం
ప్రతీ నెలా మూడు నెలల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తుంది టీటీడీ.
శిక్షణ పూర్తైన గ్రూప్ సూపర్వైజర్లు భక్తులకు ఇవ్వాల్సిన సూచనలు, ఆచరించాల్సిన నియమాలు ముందుగానే వివరించనున్నారు.



