తమిళనాడు సముద్రతీరంలో దొరికిన “ప్రళయ చేప” అసలు కథ…!!

కొద్ది కాలం క్రితం తమిళనాడుకి చెందిన కొంతమంది సముద్ర జాలర్లకు ఓ పొడ వాటి చేప సముద్రపు ఒడ్డునకు కొంత సముద్రం లోపల పట్టుబడింది.ఈ చేపను ఆ జాలర్లు పట్టుకుని పూర్తిగా సముద్రపు ఒడ్డుకి చేర్చి పరిశీలించారు.ఆ చేపను ‘ప్రళయ చేప’ అంటారని, ఈ చేప సముద్ర జలాల్లో చాలా లోతైన ప్రాంతంలో ఉంటుందని చెబుతారు. సహజంగా ఇది అరుదుగా కనిపిస్తుంది అని కూడా చెబుతారు.ఇది ఇలా సముద్రపు ఒడ్డుకి వచ్చింది అంటే, భూకంపాలు,సునా మీలు పొంచి ఉన్నాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంటారు కొందరు.మరి కొందరికైతే ఈ చేప చూసేందుకే చాలా విచిత్రంగా కనిపిస్తుంది.

తమిళనాడు సముద్రతీరం లో కనిపించిన ఈ ప్రళయ చేపను పలురకాల పేర్లతో కూడా పిలుస్తారు.ఓర్ఫిష్, రిబ్బన్ చేప,డూమ్స్ డే ఫిష్ అని పలు ప్రాంతాల్లో పలురకాల పేర్లతో పిలుస్తారు.అయితే,ఈ చేప దర్శనం అరిష్టాలకు కారణమని ముఖ్యంగా భూకంపాలు,సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు ఒక సంకేతమని కొన్ని దేశాల్లో బలంగా నమ్ముతారు. దీంతో ఈ ‘ప్రళయ చేప’ వార్త స్థానికులతో పాటు ఇప్పుడు సోషల్ మీడియా లోనూ,ప్రజల్లో తీవ్రభయాందోళనలకు దారితీసింది. రిబ్బన్ లాంటి శరీరానికి ప్రసిద్ధి చెందిన ఈ సముద్ర చేప కొన్ని జపనీస్ జాన పద కథల్లో ఓర్ ఫిష్ భూకంపాలు లేదా సునామీలను సూచిస్తుందని వినికిడి.ఇది అక్కడి కథలు ఆధారంగా చెప్పుకోవడమేగానీ ఇది వాస్తవం అని చెప్పబడిన ఆధారాలు ఎక్కడా లేవు.

ఇక ఈ ఓర్ ఫిష్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ మనం చెప్పుకోవాలంటే,ఇవి లోతైన సముద్ర జీవులు. ఓర్ ఫిష్ లోతైన సముద్ర జలాల్లో మాత్రమే నివసి స్తుంది.ఇది సాధారణంగా 200-1,000 మీటర్ల మధ్య లోతుల్లోఉంటుంది.పొడవు గా మరియు సన్నగా ఉండి 8 మీటర్లు అంటే సుమారు 26 అడుగులు పొడవుగా పెరుగుతాయి. ఓర్ ఫిష్‌లు సముద్ర ఉపరితలం దగ్గర చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి.అలాగే అవి ఆరోగ్యం క్షీణించి,తీవ్ర అనారోగ్యంతోను లేదా గాయాల పాలైనప్పుడు లేదు చనిపోయినప్పుడు ఇవి సముద్ర తీరప్రాంతం లో మరియ సముద్రపు ఒడ్డుకు కొట్టుకువస్తాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి