నిర్మల్: ప్రస్తుత టెక్నాలజీ యుగం లో నేరగాళ్లు తెలివి మీరుతున్నారు, దర్యాప్తు అధికారులకు చిక్కకుండా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. గతంలో వేలి ముద్రల ఆధారంగానే నేర దర్యాప్తు చేసేవారు.కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక “అంబిస్ టెక్నాలజీ”తో కాలిముద్ర లు, ఐరిస్,ముఖ కవళిక లు, ఎత్తు, బరువు,చేతి రాత, ఇలా ప్రతి విషయా న్ని నమోదు చేయవచ్చు.
నిర్మల్ జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం12 పోలీసు స్టేషన్లకు ఈ అంబిస్ పరికరాలను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గతంలో అఫిజ్ టెక్నాలజీ ఉపయోగించి లైవ్ స్కానర్ ద్వారా నేరగాళ్ల వేలిముద్రలు,అర చేతి ముద్రలు మాత్రమే తీసుకునేవాళ్ళం ,కానీ ఇప్పటి నుండి అత్యాధుని క టెక్నాలజీ అయిన అంబిస్ ను ఉపయోగించడం జరుగుతుంది,ఈ అంబిస్ టెక్నాలజీలో డెల్ ఆప్టిప్లెక్స్ ఆల్ ఇన్ వన్ 7420 (సిస్టమ్), ఐరిస్ స్కానర్ బి.ఎమ్-20(కళ్ళస్కానర్),ఎప్సన్ వి 39 స్కానర్ (పాద ముద్రల స్కానర్ ) లాజిటెక్ సి 270 వెబ్ క్యామ్(నేరస్థుల ఫోటోల ను నిక్షిప్తంచేసే పరికరం) హెల్త్ సెన్స్ బిఎస్ 161 (ఎలక్ట్రానిక్ వెయ్యింగ్ మెషిన్), ఎమ్.ఎస్.సి.డి (చెకింగ్ పరికరం)పాపిలోన్ పామ్ లైవ్ స్కానర్ పరికరాలను జిల్లా ఎస్పీ జి.జానకి షర్మిల ఐపిఎస్ పంపిణీ చేశారు.ఈ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా నేరగాళ్ళ యొక్క పూర్తి సమాచారం అనగా ముఖ కవళికలు, ఐరిస్ (కళ్లు),ఎత్తు,బరువు మరియు పాదముద్రలను తీసుకొని డేటాబేస్ సర్వర్ లో నిక్షిప్తం చేయడం జరుగుతుంది తద్వారా ఆ నేరగాళ్లు మళ్ళీ ఎప్పుడైన నేరం చేసి పట్టుబడినప్పుడు ఈ అంబిస్ టెక్నాలజీ ఉపయోగించి,నేరగాళ్లను చాలా సులభంగా గుర్తిస్తామని పేర్కొన్నారు.
ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్, ఎం.ఎస్.సి.డి పాపిలోన్ డివైస్ ట్రైనింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని, ఈ డివైస్ ల వినియోగం గురించి ఎలాంటి సందేహాలున్న ఫింగర్ ప్రింట్ ఇంచార్జి ఏ.ఎస్ఐ కిరణ్ తో నివృత్తి చేసుకోవాలని అన్నారు.సిబ్బంది ప్రతి ఒక్కరూ ఈ ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్ మరియు ఎం.ఎస్.సి.డి పాపిలోన్ డివైస్ ల పై నైపుణ్యత కలిగి తమ,తమ పోలీసు స్టేషన్ లలో నమోదు అవుతున్న వివిధ రకాల నేరాలు,సస్పెక్ట్ చెక్ పింగర్ ప్రింట్స్ సేకరించి, కేసుల చేదనకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరూ కూడా తమ విధులలో పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో నిబద్దతితో పనిచేయాలని,తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందాలని అన్నారు.ప్రతి ఒక్కరూ తమ విధులపట్ల శ్రద్ధవహించి,పోలీసు శాఖ కు మంచి పేరు తీసుకు రావాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమం లో జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపిఎస్,నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీన ఐపి ఎస్,ఇన్స్పెక్టర్ లు నైలు, ప్రవీణ్ కుమార్, క్రిష్ణ, డి.ఎస్.బి ఇన్స్పెక్టర్ సమ్మయ్య,ఆర్ఐ లు రాం నిరంజన్ రావ్ (అడ్మిన్), శేఖర్, రామక్రిష్ణ, ఎస్ఐ లు, ఆర్ ఎస్సై తదితర సిబ్బంది పాల్గొన్నారు.