అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో చిచ్చు రగులుకుంది. ఓ ప్రముఖ టి.వి,న్యూస్ ఛానల్ డిబేట్ లో ఓ జర్నలిస్ట్ మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని కాదు, అమరావతి అనేది వే*శ్యల రాజధాని అని సంభోదించారని అమరావతి రైతులు,మహిళా రైతులు ఆరోపణలు చేస్తూ…ఆదివారం తుళ్ళూరులో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.స్థానిక రైతులు,మహిళలు,అమరావతి రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ అమరావతి వాసుల పట్ల ఇటువంటి అనుచిత వాఖ్యలను ఖండించారు. తుళ్ళూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు.24 గంటల్లో ఆ డిబేట్ నిర్వాహకులు,దానిలో పాల్గొని అనుచిత వాఖ్యలు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోక పోతే ఉద్యమానికి అయినా సిద్ధంగా ఉన్నామని ప్రధానంగా రాజధాని మహిళలు అన్నారు.

కేసర్ లైవ్ సోలో దేవతల రాజధాని అమరావతి కాదు వే*శ్యల రాజధాని అని మహిళలపై అసభ్య పదజాలంతో మాట్లాడిన దానిపై అమరావతి మహిళలు రైతులు తుళ్ళూరు బస్టాండ్ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు.ఆ డిబేట్ నిర్వాహకుడు మరియు జర్నలిస్టుగా చెప్పబడుతున్న కృష్ణంరాజు అనే వ్యక్తి చిత్రపటాలను గోడపైన అంటించి మహిళలు చెప్పులతో కొడుతూ తీవ్రమైన నిరసన తెలిపారు.అనంతరం ర్యాలీగా బయలుదేరి స్థానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు కాపీ అందచేశారు.
రైతులు మీడియాతో మాట్లాడుతూ…
రాజధాని కోసం మరియు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన మమ్మల్ని ఇలా చిత్రీకరించడంపై చాలా బాధగా ఉందని,మీ ఇంట్లో తల్లి పిల్లలు మహిళలే అని గుర్తుంచుకోవాలని ఆవేద న వ్యక్తం చేశారు.ఆ ఛానల్లో ఇటువంటివి ప్రసారమై 24 గంటలు అవుతున్నప్పటికీ ఆ ఛానల్ నిర్వాహకులు ఇంతవరకు స్పందించలేదు అంటే, మహిళల పట్ల వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని మీడియా ముందు వారి బాధను వ్యక్త పరిచారు. గతంలో వారిపై వేరేవారు అసభ్యంగా మాట్లాడినందుకు తాము కూడా అప్పుడే ఖండించాము.24 గంటల్లో ఇటువంటి వారిని అరె*స్ట్ చేయకపోతే ఉద్యమం చేయటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.