ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెనపై వందే భారత్ రైలును భారత ప్రధాని నరేంద్రమోదీ త్వరలో ప్రారంభించనున్నారు.దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఈ చీనాబ్ వంతెన నిర్మాణం లో ప్రభుత్వం చాలా అవాంతరాలను ఎదుర్కొని ఎట్టకేలకు ప్రారంభస్థాయికి చేరుకోవడం అనేది ఒక మంచి అద్భుతమైన సృష్టిగా చెప్పుకోవచ్చు.
జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ నది పై భారత ప్రభుత్వం తలపెట్టిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినటువంటి రైల్వే వంతెనను నిర్మాణం సీజేసింది.అయితే దీనిని చీనాబ్ బ్రిడ్జి ప్రాజెక్టుగా పిలువబడుతుంది. మొదట్లో సుమారుగా రూ.552 కోట్ల అంచనా వ్యయంతో కొంకణ్ రైల్వే ఈ వంతెనను నిర్మాణం చేయించింది.ఆ వ్యయం కూడా రాను రాను బాగా భారమైపోయింది.అయినా సరే నిర్మాణం చేయించే విషయంలో రాజీపడ లేదు.మొత్తం మీదట బారాముల్లా-జమ్మును కలిపే ప్రయత్నంలో భాగంగా ఈ వంతెన నిర్మాణం ఇన్నేళ్లకు పూర్తయ్యింది.ప్రధాని మోడీ చేతులమీదుగా త్వరలో ప్రారంభంకానున్న ఈ చీనాబ్ బ్రిడ్జి ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి పడుతున్న సమయం ఆరున్నర గంటలు కాగా ఈసమయం ఇప్పుడు సగానికి తగ్గి పోవడం జరుగుతుంది. ఇక దీని నిర్మాణం మొత్తం లో దీని ఎత్తు 359 మీటర్లు.
ఈ నదిపై నిర్మాణం కాబడిన చీనాబ్ బ్రిడ్జి ఎత్తు మనం చూడాలి అనుకుంటే అది ప్రస్తుతం ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఉన్న ఈఫిల్టవర్ కన్నా మరో 35 మీటర్లు ఎక్కువగానే ఎత్తులో ఉంటుంది. అయితే అప్పట్లో 2016 చివరి నాటికల్లా ఈ వంతెన నిర్మాణం పూర్తిచేయాలనే లక్ష్యంతో ఇంజినీర్లు కృషి చేశారు. భూకంపాలు,బలమైన ఈదురుగాలులను తట్టుకుని నిలబడేలా దీని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్మాణం ఆలస్యమైంది.వాస్తవానికి 2002 లోనే చీనాబ్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైనా బలమైన ఈదురుగాలులను తట్టుకోగలుగుతుందా? అన్న అనుమానంతో2008 లో నిర్మాణం నిలిచి పోయింది.ఆ తరువాత రెండేళ్లకు దాని డిజైన్పై సందేహాలు వీడడంతో 2010లో దీని నిర్మాణం మళ్ళా మొదలైంది.ఈ చీనాబ్ బ్రిడ్జి నిర్మాణానికి సుమారుగా 25వేల టన్నుల ఇనుము అవసరం ఉంటుందని అంచనా.అలాగే ఇంద్ర ధనుస్సు (ఆర్క్) ఆకారం లో నిర్మిస్తున్న ఈ వంతెన యొక్క విడిభాగాలను చీనాబ్ నది పక్కనే తయారుచేసి అక్కడ నుండి రెండు కేబుల్ కార్ల సహాయంతో వంతెనకు జత చేయడం జరిగింది.
దేశంలో ఇదోచారిత్రక మైలుస్టోన్ గా నిలవనుంది.త్వరలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రపంచం లోనే అతిఎత్తైన రైల్వే ఆర్చ్ – జమ్మూ & కాశ్మీర్ లోని చీనాబ్ వంతెనపై ఉంది అని రికార్డు భారత్ కి దక్క నుంది.ఈ బ్రిడ్జిపై ఈ ఐకానిక్ రైలు సేవలను,దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో ప్రారంభించనున్నారు.