ప్రపంచం మొత్తం మీదట ఒక భయంకరమైన దీవుల లో ఇకటి ఎక్కడ ఉందో…. తెలుసుకుందాం.ఇటలీలో వెనీషియన్ లగూన్ లో ఈ పోవేగ్లీయా లో ద్వీపం ఉంది.దీనినే దయ్యాలదీవి అని కూడా అంటారు.ఈ ద్వీపం గురించి మొదట సారిగా క్రీ.శ, 421 నాటి చరిత్రలలో ప్రస్తావించబడింది.రోమన్ సామ్రాజ్య కాలం నాటి చీకటి చరిత్ర ను కలిగివుంది ఈ దెయ్యాల ద్వీపం.ఈ ద్వీపానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, మనం పూర్వ చరిత్రలోకి వెళ్ళాలి.
18వ శతాబ్దంలో ఈ పోవేగ్లీయాలో ద్వీపం ప్లేగు వ్యాధి సోకిన వారిని నిర్బంధించే ఒక క్వారంటైన్ కేంద్రంగా మారింది. ఇప్పుడు మనకు కరోనా అనేది ఎలా ఉందో పూర్వం ప్లేగు వ్యాధి కూడా అంత భయంకరమైన వ్యాధి, పైగా మందులు లేని అంటువ్యాధి.అందుకే అప్పట్లో ప్లేగు వ్యాధి సోకిన వారందరిని ఆ చుట్టుపక్కల దేశాలు మొత్తం ఆ ద్వీపంలో భందించేవారు.ఇక ఆ వ్యాధితో భాధపడేవారంతా,అక్కడే ఉండి ఇబ్బందులు పడుతూ పగవారికి రాని కష్టాలను అనుభవించి,అరణ్య రోదన చేస్తూ ప్రాణాలు వదిలేవారట!అక్కడ మరణించిన వారంతా దెయ్యాలుగా మారారని,అక్కడ వారి ఆత్మలు అరుస్తూ…. రోదిస్తూ…ఉండేవారట!అలా అప్పట్లో ఒక లక్షన్నర మంది మృత్యువాత పడ్డారని అందుకే అది దయ్యాల దీవిగా చెబుతారు. దీనిని మానవ బూడిదతో నిండిన మృత్యుదిబ్బ, దెయ్యాల దిబ్బ,మానవ ఆత్మలతో నిత్యం దెయ్యాల అరుపులు,వాటి రోదనలతో ఆ దీవిని ప్రపంచంలో నే అతి భయంకరమైన ప్రదేశాలలో ఒకటిగా చెప్పబడుతోంది.కొన్నేళ్ళ క్రితం వరకు ఈ దీవి సమీపంలోకి వెళ్ళాలి అంటేనే స్థానికులకు గుండె జారిపోయేదని చెప్పుకుంటారు.
అలా కాలం ముందుకు నడుస్తున్న కొద్ది 9వ శతాబ్దంలో ఈ ద్వీపంలో మెల్లగా జనాభా పెరగడం ప్రారంభమైంది. తరువాతి శతాబ్దాలలో దాని ప్రాముఖ్యత క్రమంగా పెరిగింది. అలా 1379లో, వెనిస్ జెనోయిన్ నౌకాదళం నుండి చాలావరకు అంతరించింది అని చెబుతారు.అటువంటి పరిస్థితుల్లో అక్కడ నివసిస్తున్న పోవెగ్లియా ప్రజలను గియుడెక్కాకు తరలించారట!తదుపరి శతాబ్దాలలో ఈ ద్వీపం జనావాసాలు లేకుండా మారిపోయింది. ఇక 1645 నుండి,వెనీషియన్ ప్రభుత్వం అక్కడి సరస్సు ప్రవేశాలను రక్షించడానికి మరియు వాటిని నియంత్రించడానికి ఐదు అష్టభుజి కోటలను కూడా నిర్మించింది.పోవెగ్లియా అష్టభుజి కోట ఇప్పటికీ మనుగడలో ఉన్న నాలుగిటిలో ఒకటి ఇప్పటికీ ఉంది.
1793లో, రెండు నౌకల్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణీకులకు ప్లేగు వ్యాధి కేసులు నమోదయ్యాయి. తత్ఫలితంగా ఈ ద్వీపం అనారోగ్యంతో ఉన్నవారికి మరోసారి తాత్కాలిక నిర్బంధ కేంద్రంలా మార్చబడింది.కాలక్రమేణా ఎన్నో పరిణామాలతో ఈ భయంకరమైన దెయ్యాలు,ఆత్మల దీవిగా చెప్పబడుతున్న ఈ దీవి ప్రస్తుతం చూసేందుకు అవకాశం లేదు.అయితే ఆ దీవిని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా చేయాలని ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తున్న అక్కడ సాధ్యపడటం లేదు.