తెలుగు వర్సిటీ పునఃరుద్ధరణలో మంత్రి కందుల దుర్గేష్ పాత్ర అమోగం

అమరావతి: తెలుగు సాహిత్యం,సాంస్కృతిక వైభవం విరాజిల్లిన రాజమహేంద్రవరానికి తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరణలో మంత్రి కందుల దుర్గేష్ పాత్ర అభినందనీయమని పలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులు, గోదావరి జిల్లాల ప్రజలు కొనియాడుతున్నారు.గత ప్రభుత్వం ఈ సాహిత్య పీఠంపై దృష్టి పెట్టక పోవడంతో శిథిలావస్థకు చేరుకొని చీకటి సంతరించుకున్న నేపథ్యంలో చారిత్రక, సాంస్కృతిక,కళా రాజధాని రాజమహేంద్ర వరానికి వెలుగులు తెచ్చేందుకు విశ్వవిద్యాలయ సాధనకు తనదైన శైలిలో మంత్రి కందుల దుర్గేష్ చేసిన విశ్వ ప్రయత్నాలకు మార్గం సుగమం అయింది. విశ్వవిద్యాలయ ఆవశ్యకతను పలుమార్లు కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి విజయవంతం కావడంలో సఫలీకృతులయ్యారు.

మంత్రి కందుల దుర్గేష్, ఇతర ప్రజా ప్రతినిధుల సహకారం వల్ల రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపడంతో ఎట్టకేలకు రాజమహేంద్ర వరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రం పునరుద్ధర ణకు నోచుకోనుంది.రాను న్న రోజుల్లో తెలుగు భాష, సాహిత్య సంస్కృతుల పరి రక్షణకు నిలయంగా ఈ విశ్వవిద్యాలయం పని చేయనుంది.తద్వారా యువతకు ఉద్యోగ అవ కాశాలు మెరుగుపడటమే గాక వారి నైపుణ్యాలను మెరుగుపర్చుకునే అవ కాశముంది.రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉనికి కోల్పోవడంతో తిరిగి వర్సిటీని సాధించేందుకు మంత్రి కందుల దుర్గేష్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

ఈ సందర్భంగా గోదావరి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన మంత్రి కందుల దుర్గేష్ ను పలువురు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు కళలకు పూర్వ వైభవం వస్తుందనే అభి ప్రాయం రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతుండటం శుభ పరిణామం.ఎందరో పండి తులను తీర్చిదిద్దిన బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి మంచి రోజులు ప్రారంభ మయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆవశ్యకత ను పరిగణలోకి తీసుకొని తమ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపేందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి