శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీతో ఘోర తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం పది మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కార్తీకమాసం వేళ భక్తుల రద్దీ పెరగడం, భద్రతా చర్యల లోపం కారణమని అనుమానం.