తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన నాగార్జున–రామ్ గోపాల్ వర్మ కలయికలో వచ్చిన ‘శివ’ చిత్రం నవంబర్ 14న రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రత్యేక వీడియోలో “రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి” అంటూ సరదాగా అభిమానులను థియేటర్లకు ఆహ్వానించారు.