ఏపీ మెగా డీఎస్సీ 2025 నియామకాలు తుది దశకు చేరుకున్నాయి. స్కోర్ కార్డుల తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 21, 22 తేదీల్లో జరగనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో తుది జాబితా, రెండో వారంలో పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. మొత్తం 16,347 పోస్టులకు 3.36 లక్షల మంది దరఖాస్తు చేశారు.