ఏపీలో వరద ముప్పు: కృష్ణా–గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తీరప్రాంతాల్లో ఈదురుగాలులు, మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. కృష్ణా నదికి జలహారతి ఇచ్చిన సీఎం, వరద పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.