గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయ రీఎంట్రీకు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు, లోకేష్‌తో వేదిక పంచుకోవడం, కాణిపాకం ఆలయ సందర్శనలో చేసిన వ్యాఖ్యలు ఆయన మళ్లీ టిడిపిలోకి చేరతారని ఊహాగానాలు బలపరుస్తున్నాయి.