ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తీరప్రాంతాల్లో ఈదురుగాలులు, మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.