కర్నూలు జిల్లా గ్రామీణ విలేఖరులకు పునశ్చరణ తరగతులు

కర్నూలు జిల్లా గ్రామీణ విలేఖరుల కోసం సెప్టెంబర్ 13,14 తేదీల్లో సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో పునశ్చరణ తరగతులు జరగనున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా, AI, క్రైమ్ రిపోర్టింగ్, గ్రామీణ కథనాలు, పత్రికా భాష తదితర అంశాలపై సీనియర్ జర్నలిస్టులు శిక్షణ ఇస్తారు.

ప్రకాశం జిల్లా గ్రామీణ విలేఖరులకు పునశ్చరణ తరగతులు

ప్రకాశం జిల్లా గ్రామీణ విలేకరుల కోసం ఆగష్టు 30, 31 తేదీలలో మార్కాపురంలో పునశ్చరణ తరగతులు నిర్వహించనున్న సి.ఆర్.మీడియా అకాడమీ. క్రైమ్ రిపోర్టింగ్, ఫ్యాక్ట్ చెక్, పత్రికా భాష, AI వంటి అంశాలపై సీనియర్ జర్నలిస్టుల శిక్షణ.

అమరావతిపై అబద్ధపు ప్రచారం – భావ ప్రకటన స్వేచ్ఛ అంశంపై విజయవాడలో సెమినార్

అమరావతిపై అబద్ధపు ప్రచారం, భావ ప్రకటన స్వేచ్ఛ అంశంపై ఆగస్టు 28న విజయవాడలో సి ఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సెమినార్ జరుగుతోంది. జస్టిస్ టి. సునీల్ చౌదరి, తుంగా లక్ష్మీనారాయణ, చరిత్రకారుడు పాపినేని సాయి, రైతు జొన్నలగడ్డ కిరణ్ తదితరులు ఇందులో పాల్గొననున్నారు.