ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పెద్ద శుభవార్త ప్రకటించింది. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తల సమస్యలను పరిష్కరించేందుకు అంతర్జిల్లా బదిలీలకు అనుమతి ఇచ్చింది. నవంబర్ నెలాఖరు నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.