పల్నాడు జిల్లా వినుకొండలో ఉమ్మివేశాడన్న కారణంతో యువకుడిపై కర్రలతో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. బాధితుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు.