గోదావరి వరద భయంకరం: భద్రాచలం వద్ద నీటిమట్టం 37 అడుగులు, అప్రమత్తత జారీ

భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం 37 అడుగులకు చేరింది. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, పినపాక తదితర ప్రాంతాల్లో ముంపు ముప్పు కొనసాగుతోంది.

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది – ప్రజలు అప్రమత్తంగా ఉండండి!

శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్‌ల నుండి భారీ వరద నీరు విడుదల కావడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. NDRF, SDRF సిబ్బంది సిద్దంగా ఉంచుతూ ప్రజలను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.