మహారాష్ట్ర సమృద్ధి హైవేపై గురువారం తెల్లవారుజామున లగ్జరీ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ హుస్సేన్ సయ్యద్ అప్రమత్తతతో 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతుండటంతో హైవే భద్రతపై చర్చ మొదలైంది.