ఆంధ్రప్రదేశ్‌లో 6,024 కొత్త కానిస్టేబుళ్లను సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, ఆన్‌లైన్ మోసగాళ్లను అరికట్టేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైబర్ నిపుణుల క్లాసులు ప్రారంభం కానున్నాయి.