ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తుండగా, లోతట్టు గ్రామాలు ముంపు ముప్పులో ఉన్నాయి. అధికారులు అప్రమత్తం చేస్తూ పునరావాస ఏర్పాట్లు చేస్తున్నారు.