నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్కాలనీలోని కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రిలో చికిత్స సమయంలో 15 మంది చిన్నారులు ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే అస్వస్థతకు గురవడం కలకలం రేపింది. వైద్య నిర్లక్ష్యం ఆరోపణలతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఆరోగ్య శాఖ పూర్తి స్థాయి విచారణ ప్రారంభించింది.