మోంతా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు తీవ్రతరం అయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడుతో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తుపాను పరిస్థితులపై ఫోన్‌లో చర్చించారు. పాఠశాలలకు సెలవులు పొడిగించగా, కోనసీమలో 170 ఆర్టీసీ సర్వీసులు రద్దు చేశారు. ప్రకాశం, ఒంగోలు, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు, విద్యుత్‌ అంతరాయాలు.