ఆంధ్రప్రదేశ్ టీడీపీలో మళ్లీ కలహాలు భగ్గుమన్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆదేశాలు, పల్లా శ్రీనివాసరావుతో భేటీ రాజకీయ చర్చకు దారితీసింది.