అమరావతిపై దుష్ప్రచారం తగదు – సదస్సులో నిపుణులు, మేధావుల స్పష్టం

అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగజేస్తోందని నిపుణులు, మేధావులు సదస్సులో స్పష్టం చేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో అబద్ధపు ప్రచారం చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని, అమరావతికి చారిత్రక ప్రాధాన్యం ఉందని నిపుణులు గుర్తుచేశారు.

అమరావతిపై అబద్ధపు ప్రచారం – భావ ప్రకటన స్వేచ్ఛ అంశంపై విజయవాడలో సెమినార్

అమరావతిపై అబద్ధపు ప్రచారం, భావ ప్రకటన స్వేచ్ఛ అంశంపై ఆగస్టు 28న విజయవాడలో సి ఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సెమినార్ జరుగుతోంది. జస్టిస్ టి. సునీల్ చౌదరి, తుంగా లక్ష్మీనారాయణ, చరిత్రకారుడు పాపినేని సాయి, రైతు జొన్నలగడ్డ కిరణ్ తదితరులు ఇందులో పాల్గొననున్నారు.