కోహ్లీకి శ్రేయస్ అయ్యర్ అప్పుడే చెప్పాడు… “ప్లేఆఫ్స్‌లో కలుద్దాం!” ఇప్పుడు అది నిజమైంది!

ఈ రోజు ఐపీఎల్‌లో మాస్ సినిమాకు తక్కువేమీ కాదు. ఈ సీజన్‌లో నిజమైన రివేంజ్ మ్యాచ్స్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్‌లు. మొదట బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ ఘన విజయం సాధించగా, ఆ రివెంజ్‌కి తగినట్లు ముల్లాన్‌పూర్‌లో ఆర్సీబీ గెలిచి తీరింది.

ఆ సమయంలో కోహ్లీని మైదానంలో చూసి శ్రేయస్ అయ్యర్ అన్నాడు, “ప్లేఆఫ్స్‌లో కలుద్దాం!” అని. ఇప్పుడు ఆ మాట నిజమైంది. రెండూ ప్లేఆఫ్స్‌కి మాత్రమే కాదు, క్వాలిఫయర్-1 వరకు చేరుకున్నాయి.

ఈ సీజన్‌లో అసలైన రివేంజ్ కథ ఇదే!
పంజాబ్ RCBని చిన్నస్వామిలో ఓడించింది. ఆ తర్వాత ఆర్సీబీ పంజాబ్‌ను వాళ్లే హోమ్ గ్రౌండ్ ముల్లాన్‌పూర్‌లో ఓడించింది. ఓ మ్యాచ్‌లో శ్రేయస్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయాడంటే, మరో మ్యాచ్‌లో కోహ్లీ పంజాబ్ ఆటగాళ్లపై మైదానంలోనే ఉద్వేగంతో గట్టిగా స్పందించాడు. అంతగా కోహ్లీ ఫైర్ అయ్యాడు.

మళ్లీ ఇప్పుడు అదే రెండు జట్లు – ప్లేఆఫ్స్‌లో తలపడుతున్నాయి. అది కూడా క్వాలిఫయర్-1లో.

ఈ మ్యాచ్ ముల్లాన్‌పూర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టుకు మరొక అవకాశం ఉంటుంది – ఎలిమినేటర్ విజేతతో తలపడేందుకు.

ఇతర విశేషాలు:

  • RCB ఇప్పటివరకు 3 సార్లు ఫైనల్స్‌కు వెళ్లింది – కానీ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేకపోయింది.
    • 2009లో డెక్కన్ చార్జర్స్ చేతిలో ఓటమి (6 పరుగుల తేడాతో)
    • 2011లో CSK చేతిలో ఓటమి (58 పరుగుల తేడాతో)
    • 2016లో SRH చేతిలో ఓటమి (8 పరుగుల తేడాతో)
  • పంజాబ్ కింగ్స్ ఒక్కసారే ఫైనల్‌కు వెళ్లింది – అది 2014లో. కానీ అక్కడ కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. అప్పటినుంచి ఇక ఫైనల్‌లో అడుగుపెట్టలేకపోయింది.

ఇప్పుడు ఈ రెండు టీమ్‌లు మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం, కానీ ఈ మ్యాచ్ మాత్రం మిస్ కాకూడదు!

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి