పూరి జగన్నాథుడి రథయాత్రకు వెళ్లాలా? APSRTC సూపర్ ప్యాకేజ్ సిద్ధం!

పూరి జగన్నాథుడి రథయాత్రను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. ఈ మహాసభకు హాజరయ్యే భక్తుల కోసం APSRTC ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఈ యాత్ర జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

జూన్ 25న బస్సు ప్రయాణం – 7 పుణ్యక్షేత్రాల దర్శనం

రాజమహేంద్రవరం డిపో నుండి జూన్ 25 సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులు బయలుదేరనున్నాయి. నాలుగు రోజుల ఈ యాత్రలో భక్తులు ఏకంగా ఏడు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అరుదైన అవకాశం కలుగుతుంది. వీటిలో ప్రధానంగా:

  • సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం
  • అరసవిల్లి సూర్యదేవాలయం
  • శ్రీకూర్మం కూర్మనాథ ఆలయం
  • భువనేశ్వర్ లింగరాజ ఆలయం
  • సాక్షిగోపాల్ వేణుగోపాల ఆలయం
  • కోణార్క్ సూర్యదేవాలయం
  • పూరి జగన్నాథ స్వామి ఆలయం

కంప్లిట్ ప్యాకేజీ – లగ్జరీ బస్సులలోనే ప్రయాణం

ఈ యాత్ర కోసం సూపర్ లగ్జరీ పుష్‌బ్యాక్ 2×2 సీటింగ్ బస్సులు, టీవీ తదితర సౌకర్యాలతో నడిపిస్తారు. ఒక్క టికెట్ ధరను రూ.3,500గా నిర్ణయించారు. అయితే, భోజనం మరియు వసతి ఖర్చులు యాత్రికులే భరించాల్సి ఉంటుంది.

ఎన్ని బస్సులైనా సిద్ధం – బుకింగ్ ప్రారంభం

ప్రతి బస్సు పూర్తిగా నిండిన తర్వాత మరో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తామని APSRTC అధికారులు వెల్లడించారు. అవసరమైనన్ని బస్సులు అందుబాటులో ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ యాత్రకు సంభంధించి మరిన్ని వివరాల కోసం రాజమహేంద్రవరం ప్రధాన బస్టాండ్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌ను సంప్రదించవచ్చు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి