ప్రధాన అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మరో కొత్త ఈక్విటీ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఎస్బీఐ నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్ పేరిట ఈ న్యూ ఫండ్ ఆఫర్ను జూన్ 23, 2025 నుంచి ప్రారంభించనున్నారు. ఈ ఫండ్లో కనీస పెట్టుబడి రూ.5 వేలు మాత్రమే. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే వారు జూలై 3, 2025 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఈ ఫండ్ విశేషాలు:
- పేరు: ఎస్బీఐ నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్ (డైరెక్ట్ గ్రోత్ ప్లాన్)
- ప్రారంభ తేదీ: జూన్ 23, 2025
- చివరి తేదీ: జూలై 3, 2025
- NAV ధర: రూ.10
- కనీస పెట్టుబడి: రూ.5,000
- యూనిట్ల కేటాయింపు తేదీ: జూలై 10, 2025
- ఎగ్జిట్ లోడ్: 0.2%
- బెంచ్మార్క్ ఇండెక్స్: నిఫ్టీ 200 మూమెంటమ్ 30 టోటల్ రిటర్న్ ఇండెక్స్ (TRI)
- రిస్క్ స్థాయి: చాలా అధికంగా (Very High)గా సెబీ ద్వారా పరిగణించబడింది
మార్కెట్ పరిణామాల నేపథ్యంలో:
ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పట్ల యువతలో ఆసక్తి పెరుగుతోంది. నెలవారీగా లక్షలాది మంది పెట్టుబడులు పెడుతున్నారు. ఇది గమనించిన అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు కొత్త స్కీమ్లను తీసుకొస్తున్నాయి. అందులో భాగంగా ఎస్బీఐ నుంచి వచ్చిన ఈ ఫండ్, మూమెంటమ్ బేస్డ్ స్టాక్లను అనుసరిస్తుంది.
పెట్టుబడిదారులకు సూచన:
ఈ స్కీమ్లో రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశముంది. అందువల్ల పెట్టుబడి నిర్ణయానికి ముందు నిపుణుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి చేసే ముందు పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని గమనించి ముందడుగు వేయాలి.
ఈ కథనం కేవలం సమాచార లక్ష్యంతో మాత్రమే అందించబడింది. ఏ విధమైన పెట్టుబడులకు ప్రోత్సహించదని గమనించగలరు.