పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించండి: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ మాటలు

పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిణామాలను పరిగణలోకి తీసుకొని, తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

మోదీ మాట్లాడుతూ, “ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని పునరుద్ధరించేందుకు చర్చలు, దౌత్య మార్గాలే పరిష్కారమని సూచించాను. జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను” అని తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు.

ఇదే సమయంలో, అమెరికా కూడా ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తూ, ఇరాన్‌లోని కీలకమైన మూడు అణు కేంద్రాలపై తీవ్ర గాలి దాడులు చేసింది. ఈ దాడుల్లో అణు కేంద్రాలు గణనీయంగా దెబ్బతిన్నట్టు సమాచారం. ఇరాన్ అధికారిక లెక్కల ప్రకారం, ఈ దాడుల్లో సైనికులు, సాధారణ పౌరులు కలిపి కనీసం 865 మంది మృతిచెందారు.

అమెరికా జోక్యం పై ఇరాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మూడవ పక్షంగా అమెరికా రావద్దని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. కానీ అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా దాడులు చేపట్టింది. పశ్చిమాసియా మొత్తం ఉద్రిక్తతల మడుగులోకి వెళ్లే ప్రమాదం ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ హెచ్చరిస్తోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి