ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూపంతా…తాడికొండ వైపే చూస్తుంది.

అమరావతి: ఏపీ రాజధాని అమరాతిలో స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేసుకోవాలని ఆ చుట్టుపక్కల కాస్త డబ్బునవారి ఆలోచన. అయితే అమరావతిలో ఎక్కడ స్థలం కొనుగోలు చేయాలని ఊహలకు అందని ఆలోచనలతో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.ఇక ఏ.పీ,రాజధాని అమరావతి అనేది గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత ఇక్కడ రియల్ బూమ్ అనేది పెద్ద ఎత్తున ముందుకు సాగింది.వైసీపీ హయాంలో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యవహారం పెద్దగా సాగలేదు.చాలావరకు ఇంటి స్థలాలు కొనుగోలు పూర్తిగా పడిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం రాకతో ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ మెల్ల మెల్లగా మళ్లీ ఊపందుకుంటోంది.

రాజధాని అమరావతి ప్రాంతం తాడికొండ నియో జకవర్గంలో ఉండటం వల్ల, ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల ప్లాట్‌లు,రెసిడెన్షియల్ ఆస్తులపై బాగా డిమాండ్ ఉంది.ఇకపోతే కాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) ఆమోదం పొందిన లే అవుట్‌లకు ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. అమరావతి ప్రాజెక్ట్ ఆలస్యం కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత మందగించినప్పటికీ, 2024-2025లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు మరియు పూర్తిస్థాయి అభివృద్ధిపై హామీ ప్రభుత్వ ప్రాజెక్ట్‌లపై స్పష్టత రావడంతో స్థానిక భూములకు మళ్లీ డిమాండ్ పెరిగింది. రెసిడెన్షియల్ ప్లాట్‌లతో పాటు,అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు,గేటెడ్ కమ్యూని టీల నిర్మాణం కూడా జరుగుతోంది.

తాడికొండ పరిసర ప్రాంతాల్లో 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ధర ఇప్పుడైతే సుమారు 15 లక్షల వరకూ నడుస్తోంది. ప్రధాన రహదారులు, అమరావతి సమీపంలోని ప్లాట్‌లు ఎక్కువ రేటు ఉంటున్నాయి. ఇళ్ల నిర్మాణం జరిగే చోట అయితే సహజంగానే ఎక్కువ ధరలు ఎక్కువగా ఉన్నాయి.అయితే సగటున గజం స్థలం ధర పది వేల నుంచి ఇరవై వేల వరకూ ఉంటుందని తెలుస్తుంది.ఇక అమరాతి నిర్మాణం అనేది మరింత ఊపందుకుంటే.. ధరలు అనూహ్యంగా పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి