అమరావతి;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శనివారం ముందస్తుగా అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపి వేయడం కొంచెం హాట్ టాపిక్ గా మారింది.ఈ నెల10వ తేదీ అనగా (మంగళవారం) రాత్రి అనంతరం ఆన్ లైన్ సేవలను నిలిపివేయనున్నట్లుగా సమాచారం స్పష్టం అవుతోంది.ఈ మేరకు గ్రామ,వార్డు సచి వాలయాల శాఖ డైరెక్టర్ ఎం. శివప్రసాద్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
సాంకేతిక మార్పుల కారణంగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సేవ పోర్టల్ ని ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ క్లౌడ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ డేటా సెంటర్కు మైగ్రేట్ చేస్తోంది.ఈ డేటా మార్పిడి చేస్తున్న కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చునని అధికారులు వెల్లడించడం జరిగింది.
◆ ఆదాయ ధ్రువీకరణ పత్రం.
◆ సమగ్ర ధ్రువీకరణ పత్రం.
◆ భూమి మ్యుటేషన్లు.
◆ ఇళ్ల స్థలాల దరఖాస్తులు / పట్టాలు
◆ వృద్ధాప్య ధ్రువీకరణ పత్రం
◆ వివాహ ధ్రువీకరణ పత్రం
◆ రేషన్ కార్డు సంబంధిత సేవలు
◆ రెవెన్యూ శాఖ సేవలు (జమాబందీ, పట్టాదారు పాస్బుక్ తదితరాలు)
◆ వాటర్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్లు
◆ పట్టణ పరిపాలన శాఖ సేవలు (గ్రీవెన్సులు, లైసెన్సులు, అప్లికేషన్లు మొదలైనవి)
◆ మత్స్య శాఖ సేవలు (ఫిషరీస్ డిపార్ట్మెంట్ లైసెన్సులు/సబ్సిడీలు)
అయితే,ఈ ఆన్లైన్ మార్పుల ప్రభావం అన్ని ప్రభుత్వ సేవలపై ఉండదని,కొన్ని ఇతర సేవలు – బ్యాంక్ సేవలు, ఆధార్ అప్డేట్స్, పలు కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీములు,నాన్-రెవెన్యూ ఆధారిత సేవలు వంటి కొన్ని సేవలు మాత్రం మీ సేవా కేంద్రాల్లో యథావిధి గా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలియజేయడమైనది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు తమకు అవసరమైన ఆన్ లైన్ సేవలు వినియోగిం చుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర మైన పత్రాల పనుల కోసం ముందుగానే ధ్రువీకరణ పత్రాలు లేదా వాటి యొక్క అప్లికేషన్లు చేసుకోవాలని సూచించడమైంది.ప్రస్తుతం ఉన్న అంతరాయం ముగిసిన వెంటనే ఆన్ లైన్ సేవలు మళ్లీ పూర్వపరిస్థితికి తీసుకువస్తామని వారు వెల్లడించారు.అయితే ప్రజలు మరింత సమాచారం కోసం https://ap.gov.in/ లేదా గ్రామ సచివాలయంకి చెందిన అధికారిక పోర్టల్స్ను సందర్శించవచ్చని వారు వివరించారు.