రేషన్ కార్డుల ప్రక్రియకు గడువు లేదు:మంత్రి నాదెండ్ల

కూటమి ప్రభుత్వం ప్రజల కు అందిస్తున్న రేషన్ కార్డు ల ప్రక్రియను రాష్ట్ర ప్రజలు పెద్దఎత్తున దరఖాస్తు చేసు కుంటున్నారు.నూతన రేషన్ కార్డుల దరఖాస్తు, మార్పులు చేర్పులకు గడువు అనేది లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.రేషన్ కార్డుకు అర్హత ఉన్న వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయన గురువారం పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి అన్నారు.కొత్త రేషన్ కార్డుల జారీ చేయడంలో ఎక్కడా కూడా ఎటువంటి జాప్యం లేదని, దరఖాస్తు చేసుకున్నవారికి కేవలం 21 రోజుల్లోపే కొత్త రేషన్ కార్డులు అందరికీ ఉచితంగా అందించనున్నామని మంత్రి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం గా మే నెల 7 నుంచి రేషన్ కార్డుల్లో మార్పులు,చేర్పు లు చేపట్టినట్లు మంత్రి ఏపి రాష్ట్ర సచివాలయంలో తెలిపారు.గత రెండేళ్ల నుంచి రేషన్ కార్డుల్లో మార్పులకు అవకాశం రాలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.ఇక ఈకెవైసీ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని,అందుకు తమ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేశామని అన్నారు.దేశంలో దాదాపు 95% ఈ.కే.వై.సీ,ఇప్పటికే పూర్తిచేసుకున్న ఒకే ఒక్క రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని మంత్రి నాదెండ్ల అన్నారు.ఇక నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల 59,028 మందికి ఈ.కే.వై.సీ,పూర్తి అయ్యింది.అలాగే ఇంకా ఇరవై రెండు లక్షల59,498 మందికి ఇంకా ఈ.కే.వై.సీ, పూర్తికాలేదని మంత్రి మనోహర్ తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని,దీంతో సర్వర్ స్లో కావడం వల్ల అక్కడక్కడ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఇప్పటి వరకు ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చాయని, అరవై వేల మంది కొత్త రేషన్ కార్డులు కావాలని దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.ఇక ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు నుంచి తొలగింపు కోసం 44వేల మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు.చిరునామా మార్పులు కోసం 12,500 మంది దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి తెలియజేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి