కడపలో మూడు రోజులపాటు జరగనున్న పసుపు పండుగలో మొదటిరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ మహానాడులో ప్రసంగించారు.ఈ ప్రసంగం లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్లను ఉత్సాహపరిచే విధంగా పెద్దబాబు,చినబాబు తమ ప్రసంగాలను చేశారు.
సీఎం చంద్రబాబు ప్రసంగం.
చంద్రబాబు తన ప్రసంగంలో ”మహానాడు” అంటే నాటి నుంచి నేటి వరకు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అదే జోరు,అదేహోరు అన్నారు. దేవుని గడపలో జరిగే మహానాడు చరిత్ర సృష్టించబోతోందని,ఈ మహానాడు దశ,దిశ నిర్దే శిస్తుందని గట్టిగా చెబుతున్నా.కడప జిల్లాలో 10 స్థానాలకు 7 గెలిచి సత్తా చాటాం..వచ్చే ఎన్నికల్లో ఇంకొంచెం కష్టపడితే 10/10 స్వీప్ చేస్తాం అని చంద్రబాబు అన్నారు. 2024 ఎన్నికల్లో 57 శాతం ఓట్లు సాధించాం.టీడీపీకి ఘన విజయం అందించిన తెలుగుదేశం కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల పోరాటాలతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. పీక కో*స్తుంటే కూడా జై టీడీపీ అని చంద్రయ్య ప్రా*ణాలు వది లేశారు.చంద్రయ్య వంటి వారి స్ఫూర్తి టీడీపీని నడిపిస్తోంది.పసుపు సింహం తోట చంద్రయ్య. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి సమస్కరిస్తున్నా..త్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం.దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలు ఎదుర్కొన్నాం.టీడీపీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ల పని అయిపోయింది.టీడీపీ జెండా ఎప్పటికీ రెపరెపలాడుతునే ఉంటుంది.
తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పనిచేస్తుంది.తెలుగువారి అభివృద్ధికి టీడీపీ బ్రాండ్ అంబాసిడర్.పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు,బీసీలకు రాజ్యాధికారం,రూ.2కి కిలో బియ్యం, సబ్సిడీ కరెంట్ తెలుగు దేశం తెచ్చినవే.టీడీపీ కార్యకర్తలే నా ఆయుధాలు.కార్యకర్తలతో కలిసి ఆకాశమేహద్దుగా అభి వృద్ధి చేస్తాం.రాజకీయాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీనే.గతాన్ని స్మరిస్తూ,భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేస్తూ..తెలుగు ప్రజల ఆశయాలను చాటే ఉద్యమానికి వేదిక మహానాడు 2025.ఈ మహానాడు-2025 చరిత్రలో నిలిచిపోతుంది అని మహానాడు లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిరోజు ప్రసంగం టిడిపి నాయకులు,కార్యకర్తలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, మంత్రులు అందరిని ఆక ట్టుకునే విధంగా ప్రసంగించారు.
మంత్రి నారా లోకేష్ ప్రసంగం.
కడపలో జరుగుతున్న మొదటి రోజు మహానాడు లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ టీడీపీ అంటేనే పేదల పార్టీ అని,6 శాసనాలను నేను ఇవాళ ప్రతిపాదిస్తున్నాను అన్నారు.ఒకటి తెలుగు జాతి విశ్వఖ్యాతి,రెండు యువగళం,మూడు స్త్రీ శక్తి, నాలుగు పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్.ఐదు అన్నదాతకు అండగా ఉండటం.ఆరు కార్యకర్తే అధినేత అని చెప్పుకొచ్చారు.
తెలుగుజాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ.సమాజం లో మహిళలను చులకన గా చూసే పరిస్థితి మారిపోవాలి.తెలుగుజాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ.. మనకు అధికారం కొత్త కాదు..ప్రతిపక్షం కొత్త కాదు మారుతున్న కాలానికి తగి నట్లుగా పార్టీ కూడా మారాలి అనిలోకేష్ అన్నారు.58 మంది మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 మంది కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారు.గత ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారు.పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యం అని మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.