సినిమా థియేటర్లు మూత పడనున్నాయని జరుగు తున్న ప్రచారం వాస్తవం కాదని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ శనివారం అన్నారు.మరోప్రక్క 1జూన్ నుంచి సినిమా ధియేటర్లను మూసేస్తా మని ఎగ్జిబిటర్లు ప్రకటిం చడంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కుందుల దుర్గేష్ విచారణ కు ఆదేశించారు. హోంశాఖ కార్యదర్శికి ఆయన విచారణ చేయాలని కోరారు.ఇక సినిమా ఇండస్ట్రీలోని ఓ నలుగురు వ్యక్తులు ఇదం తా చేస్తున్నారన్న అనుమా నాలను ఆయన వ్యక్తం చేస్తున్నారు.పవన్ కల్యాణ్ సినిమా “హరిహర వీరమ ల్లు” రిలీజ్ కు దగ్గర పడిన సమయంలో ఇలా ధియేట ర్ల సమస్యను తెర పైకి తేవ డంలో నలుగురు కీలక పాత్ర పోషించారన్నది పలు అనుమానాలకు తావిస్తోం ది.ఇదే సినిమా టోగ్రఫీ మంత్రికి చేరినట్లుగా తెలుస్తోంది.
సినిమా ధియేటర్లు ఇప్పుడు ఎగ్జిబిటర్ల చేతు ల్లో లేదనేది బహిరంగ రహ స్యం.చాలా మంది ఒప్పం దాల్లో ఉన్నారు.ఇలా ఇండ స్ట్రీలోని నలుగురు ప్రము ఖుల చేతుల్లో వందల ధియేటర్లు ఉన్నాయి. ఎవరి గుప్పిట్లో పడకుండా సొంతంగా ధియేటర్లు నడి పించుకునేవారు అతి తక్కువ మంది ఉన్నారు. వారికి సినిమాలు దొరకడం కష్టంగా మారడంతో చాలా మంది తమ ధియేటర్లను మాల్స్ గా లేకపోతే ఫంక్షన్ హాల్స్ గా మార్చుకుంటు న్నారు.ధియేటర్లపై ఇప్పు డు నలుగురికి గుత్తాధిప త్యం ఉంది.వారే నిర్మాత లు,డిస్ట్రిబ్యూటర్లు కూడా. అయినా ధియేటర్లకు రెంట ల్స్,షేర్స్ అంటూ పాత వివాదాన్ని కొత్తగా తెరపైకి తేచ్చి ధియేటర్లు క్లోజ్ చేస్తా మంటున్నారు.
ఇప్పుడు ధియేటర్లు మూసేస్తే ఇక ప్రజలు ధియే టర్లు తెరిచినా రాకపోవ చ్చు.ఓటీటీలకు ఇప్పటికే అలవాటుపడిపోయారు. ధియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే టెక్నాలజీ కూడా వచ్చేసింది.పవన్ పై కోపం తోనే..పవన్ నిర్మాతలకు నష్టం చేయాలనో ధియేట ర్లు మూసే కుట్ర చేస్తే మొత్తం ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుంది.తాము కూర్చు న్న కొమ్మనే నరుక్కున్నట్లు గా అవుతుంది.ఇది ఇలా ఉంటే థియేటర్ల బంద్ ఉండదని ఓ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామో దర ప్రసాద్.తెలుగు ఫిల్మ్ ఛాంబర్ శనివారం నిర్వ హించిన మీడియా సమావేశం ద్వారా ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామో దర ప్రసాద్ మాట్లాడుతూ థియేటర్స్ బంద్ పై క్లారిటీ ఇచ్చారు.తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు,డిస్ట్రిబ్యూట ర్లు,నిర్మాతల సంయుక్త సమావేశం జరిగింది.జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు.అలాగే మూడు సెక్టార్ల నుంచి ఒక కమిటీ వేస్తున్నాం.నిర్ణీత సమయంలోగా మా సమ స్యలను పరిష్కరించుకుం టాం అని దామోదర్ తెలి పారు.
అలాగే 30న ఈసీ సమావే శంలో కమిటీ ఎవరనేది నిర్ణయిస్తామని, థియేటర్ల బంద్ పై ప్రచారా న్ని ఎవరు నమ్మరాదని ఆయన మీడియా సమా వేశంలో స్పష్టం చేశారు. అలాగే సినిమా థియేటర్ల బంద్ ప్రచారం పరిశ్రమలో అనేక అవాంతరాలను సృష్టించింది అన్నారు.సినీ పరిశ్రమలోని సమస్యలను ఎవరు పరి ష్కరించలేరు, మాకు మేమే పరిష్కరించు కోవాలి అని ఆయన చెప్పు కొచ్చారు.థియేటర్ల బంద్ హెచ్చరికలతో..ఫిల్మ్ఛాం బర్లో కీలక సమావేశం జరిగింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాత లు సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు.థియేట ర్లలో పర్సంటేజి విధానాన్ని అమలు చేయాలని పట్టు బట్టారు.ఎగ్జిబిటర్లు.పర్సం టేజి విధానం అమలు చేయకపోతే జూన్ 1నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు ఇప్పటికే హెచ్చ రికలు జారీ చేశారు.