ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏపీ సిఆర్డిఏ సౌజన్యంతో జూన్ 18, 2025న ఉదయం 10 గంటల నుంచి తుళ్లూరులోని సిఆర్డిఏ స్కిల్ హబ్ కేంద్రంలో “జాబ్ మేళా” నిర్వహించనున్నారు. ఈ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు అమరావతి పరిసర ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతోంది.
ఈ జాబ్ మేళాలో MVR ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్కిల్క్రాఫ్ట్, KVM ప్రాజెక్ట్స్ లిమిటెడ్, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలు పాల్గొంటున్నాయి.సేఫ్టీ ఆఫీసర్స్, ట్రైనీ ఇంజినీర్లు,సర్వేయర్లు, సర్వీస్ & సేల్స్ ఇంజినీర్లు, అసిస్టెంట్ టెక్నీషియన్, ఇంగ్లీష్ & సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్లు, మార్కెటింగ్ & రికవరీ ఎక్జిక్యూటివ్, రికవరీ ఆపరేటర్స్ పోస్టులతో పాటు ఆయా కంపెనీలలో భవన నిర్మాణ రంగంలో విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించేందు కు ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది.SSC, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఏదైనా డిగ్రీ, పీజీ చదివిన ఫ్రెషర్స్, అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చు. జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు రూ.12,000 నుంచి రూ. 30,000 వరకు వేతనం లభిస్తుంది. కొన్ని ఉద్యోగాలకు అదనం గా ఇన్సెంటివ్లు, అలవెన్సులు సైతం లభిస్తాయి.ఈ జాబ్ మేళా ద్వారా రాజధాని ప్రాంత యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.అర్హత కలిగిన అభ్యర్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగిం చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి వివరాలకు గ్రామంలోని సిఆర్డిఏ ఫెసిలిటేటర్ను సంప్రదించవచ్చు లేదా శంకర్ 9848424207, శ్రీకర్ 9963425999 నెంబర్లలో కాల్ చేయవచ్చు.జాబ్ మేళాకు రిజిస్ట్రేషన్ చేసుకునేందు కు నైపుణ్యం పోర్టల్ https://naipunyam.ap.gov.in/ లో నమోదు చేసుకొనవలెను.