చినాబ్ వంతెన ప్రారంభం సందర్భంగా శుక్రవారం కట్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న భారత ప్రధాని మోదీ కీలకమైన ఉపన్యాసం చేశారు.భారతదేశ ఇంజినీర్ల నైపుణ్యానికి అంజీఖాడ్ వద్ద రైల్వే తీగల వంతెన ఒక నిదర్శనం అని కొడియాడారు.కశ్మీర్ లోయకు రైలును నడపాలన్న కల ఇన్నేళ్లకు సాకారమైందని ప్రధానమంత్రి మోదీ అన్నారు.మరో ప్రక్క దేశంలో మత కల్లోలాలు సృష్టించాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ ఉందని ఆయన ఆరోపించారు.జీవనోపాధికై దేశ పర్యాటకంపై ఆధార పడుతున్న కాశ్మీర్ ప్రజలను పాకిస్థాన్ దోచేస్తుందని అన్నారు.ఇక పొరుగుదేశం అయిన పాకిస్థాన్ మానవత్వానికి,సామరస్యానికి మరియు పర్యాటకానికి శత్రువుగా తయారైందని ఆరోపణలు చేశారు.
పాకిస్థాన్ కి ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరికలు చేసారు. కశ్మీర్లోని పర్యాటకాన్ని ధ్వంసం చేయాలని పాకిస్థాన్ పలు విధాల కు-ట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యాటకానికి వ్యతిరేకమ ని,జమ్ముకశ్మీర్లోని పేదలపై పాక్ చేస్తున్న కుట్రలు పై తీవ్రంగా మండి పడ్డారు.ఇక మాటలతో కాదు చేతలతోనే పని అంటూ పాకిస్థాన్ ని హెచ్చరించడం జరిగింది.ఏ మాత్రం పాక్ ఉ*గ్రవాదంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని స్పష్టం చేశారు.పాక్ వేస్తున్న పై ఎత్తులను ఎప్పటికప్పుడు భారత్ ఎండగడుతూనే, తిప్పికొడుతూ ఉంటుందన్నారు.
అలాగే మరో కార్యక్రమం లో మాట్లాడుతూ, పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంతో పాకి స్థాన్ పై భారత్ తీసుకున్న కఠినమైనటువంటి చర్యల తో పాకిస్థాన్ కొద్దిరోజులు గా అల్లకల్లోలంగా ఉంది. సింధూనది జలాల పంపిణీ రద్దు విషయంలో పాకిస్థాన్ కి ఇప్పుడు త్రాగేందుకు నీరులేక గొంతెండుతుంది, మంచినీళ్ళు మహాప్రభో అటూ ఆదుకోవాలని భారత్ కి ఇప్పటికే నాలుగు సార్లు లేఖలు రాసిందట…!అలాగే పాక్ పౌరులకు వీసాల జారీ రద్దు,అటారీ- వాఘా బోర్డర్ మూసివేత,ఇరు దేశాల మధ్య ఎగుమతు లు,దిగుమతులు నిలిపివేయగా…భారత్ చేపట్టిన ఈ చర్యలతో పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదు ర్కొంటోందట…!అలాగే ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదుల నిర్మూలనతో పాటు పాకిస్థాన్ కు చెందిన వైమానిక స్థావరాలు,దాని డ్రోన్లు,జెట్స్ వంటివాటిని ధ్వంసం చేయడంతో పాకిస్థాన్ కి తీరని నష్టం ఏర్పడగా,ఎవరికి చెప్పుకోలేని కష్టం మిగిలింది.