మహానాడుకు వెళ్తూ కార్యకర్త ‘టీ’ కొట్టులో ‘టీ’తాగిన లోకేష్

కుప్పం/శాంతిపురం: కుప్పం నియోజకవర్గం శాంతిపురానికి చెందిన చెంగాచారి సాధారణ టిడిపి కార్యకర్త.ఆయన గృహప్రవేశం నిమిత్తం కుప్పం వచ్చి గత రెండు రోజులుగా బిజీబీజీగా ఉన్న రాష్ట్ర మంత్రి,టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశాడు. చెంగాచారి బాగోగులను వాకబుచేసిన లోకేష్ మాటల్లో ఏం చేస్తుంటావని అడిగాడు.

తాను తెలుగుదేశం పార్టీ వీరాభిమానినని,శాంతి పురంలో టీకొట్టు నడపు తూ జీవనం సాగిస్తున్నాన ని చెప్పాడు.కుప్పం నుంచి కడప మహానాడుకు బయ లుదేరిన యువనేత లోకేష్ సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా టీకొట్టు వద్ద కు వెళ్లాడు.అన్నా…చాలా దూరం వెళ్లాలి…టీ ఇస్తావా అని అడిగాడు.చెంగాచారి కి కొద్దిసేపు నోటమాటరాలే దు.తమ అభిమాననేత నేరుగా తమ టీ కొట్టుకు రావడంతో ఆయన సంభ్ర మాశ్చార్యానికి లోనయ్యా డు.యువనేత లోకేష్ కు టీ గ్లాసు అందించాడు. వ్యాపారం ఎలా ఉందని అడగ్గా చెంగాచారి స్పంది స్తూ… సర్…నేను 1994 నుంచి తెలుగుదేశం పార్టీ లో ఉంటున్నా.చంద్రబాబు గారంటే అభిమానం.నేను టిడిపికి చెందిన వాడినన్న కోపంతో గత అయిదేళ్లుగా నా టీ అంగడిని మూయిం చేశారు.

గత ఏడాది జూన్ 12న చంద్రబాబు గారు సిఎంగా ప్రమాణ స్వీకారం చేశాక 17వతేదీ మళ్లీ టీకొట్టు ప్రారంభించా. నాకు ఇద్దరు ఆడబిడ్డలు,ఒకబిడ్డకు పెళ్ల యింది…మరో కూతురికి పెళ్లి చేయాలి.మీరు మా అంగడికి రావడం నమ్మలేక పోతున్నా చిన్నయ్యా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.చెంగాచారి భుజం తట్టిన యువనేత లోకేష్…ఇప్పుడు నువ్వు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. నీ వెంట నేను న్నా, ఏ అవసరమొచ్చినా నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి ముందుకు సాగారు. కార్యకర్తకు యువనేత లోకేష్ ఎంతటి ప్రాధాన్యత నిస్తారనడానికి ఇదొక మచ్చుతునక

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి