అమరావతి: ఈ నెల 18న పల్నాడులో పర్యటించిన జగన్ కార్యక్రమంలో ఓ ప్రమాదం జరిగింది. ప్రభుత్వం భారీ ప్రదర్శన కు,ర్యాలీకి అనుమతి నిరాకరించినా,వైసీపీ శ్రేణులు మాత్రం ఆ కార్యక్రమం ముగించారు. ఇక అక్కడ జరిగిన ప్రమాదంలో,ర్యాలీలో పాల్గొన్న సింగమయ్య మృతి చెందడం అనే ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఏ 2గా జగన్మోహన్ రెడ్డిని, ఏ3 గా జగన్ ఉన్న కారు యజమానిని చేర్చారు.ఈ కారు విషయానికి వస్తే అది జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ అయిన కృష్ణమోహన్ రెడ్డిదిగా వైసీపీ పేరిట కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఇక జగన్ మోహన్ రెడ్డి డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.కాగా జగన్మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరులో ఉన్నారని సమాచారం.
అయితే ఈ ప్రమాదం మాత్రం మానవత్వానికి మచ్చగా మిగిలిందని కొందరు,అభిమానం మరీ హద్దులు దాటకూడదని కొందరు అంటున్న సింగయ్య మాత్రం తిరిగిరాని లోకాలకు చేరిపోయాడు. అనుమతి లేని ర్యాలీని నిర్వహిస్తూ.. రోడ్ మీద షో కొనసాగిస్తూ…పోలీసుల ఆంక్షలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా చేసిన ర్యాలీలో ఈ ఘటన జరిగింది.మరో ప్రక్క జగన్మోహన్ రెడ్డి కారు డోర్ నుంచి అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలోనే కారును ముందుకు పోనిస్తూ… అంతటి హడావుడిలో కార్యకర్తలు కేకలు వేసినా ఎవరూ పట్టించుకోలేదనే వాదనలు వినిపించాయి. పోలీసులు దర్యాప్తులో ప్రస్తుతానికి A1,A2,A3 లుగా కేసు నమోదు చేశారు.