కడప జిల్లాలో భార్యాభర్తల మధ్య జరిగిన ఒక చిన్న గొడవ… పెద్ద డ్రమా గా మారింది. పుట్టింటికి వెళ్లిన భార్యకు, భర్త డెత్ సర్టిఫికేట్ పంపిన ఘటన అందరినీ షాక్కు గురిచేస్తోంది.
ఏం జరిగింది?
- ముద్దనూరు ప్రాంతానికి చెందిన మార్చుతిరాజు, 14 ఏళ్ల క్రితం దూలంవారిపల్లెకు చెందిన ఆధిలక్ష్మిని వివాహం చేసుకున్నాడు
- ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు
- కొంతకాలంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి
- కోపంతో ఆధిలక్ష్మి నెల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది
భార్య వెళ్లిపోయిన తర్వాత మారుతిరాజు ఆగ్రహించి, దారుణ నిర్ణయం తీసుకున్నాడు. చనిపోయిన తన తల్లి డెత్ సర్టిఫికెట్ను మార్చి, ఆధిలక్ష్మి పేరుతో సిద్దం చేసి పోస్టులో ఆమెకు పంపించాడు.
పోస్టులో డెత్ సర్టిఫికేట్… భార్య షాక్
పుట్టింట్లో ఉన్న ఆధిలక్ష్మి, తన పేరుతో వచ్చిన మరణ ధృవీకరణ పత్రం చూసి బెదిరిపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల విచారణలో బయటపడ్డ విషయం
- మారుతిరాజు తన తల్లి పాత డెత్ సర్టిఫికెట్ని ఎడిట్ చేసి భార్యకు పంపాడు
- చిన్న గొడవకే ఇలా చేయడం దారుణమని భార్య బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
ఇదే జిల్లాలో మరో పెద్ద మోసం బయటపడింది
కడపలోనే డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసగాళ్లు, ఓ రిటైర్డ్ టీచర్ నుంచి రూ. 1.62 కోట్లు దోచుకున్నారు. భయపెట్టి డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక కుటుంబాన్ని విషాదంలోకి నెట్టిన ఈ ఘటనపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



