ముంబైలో 107 ఏళ్ళ చారిత్రక వర్షాలు,252 మి. మీ వర్షం

నైరుతి రుతుపవనాలు, అరేబియా సముద్రంలో అల్పపీడనం తాకిడితో మహారాష్ట్రను పదిరోజు లు ముందుగానే భారీ వర్షాలు ముంబైని అతలాకుతలం చేస్తున్నాయి ఈ భారీ వర్షాలకు ముంబైలో చాలా ప్రాంతాలు ముంబైని ముంపుకు గురయ్యాయి. సాధారణంగా జూన్‌ 5వ తేదీ తర్వాత ప్రవేశించే రుతుపవనాలు,ఈసారి మే చివరి వారంలోనే తమ ప్రభావాన్ని చూపించడంతో ముంబై 1990 తర్వాత మరోసారి భారీగా వరదలు ముంచెత్తాయి.అయితే ఇంత త్వరగా ముంబైని రుతుపవనాలు తాకడం ఇదే తొలిసారని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

కొలాబా అబ్జర్వేటరీ గణాంకాల ప్రకారం,ఈ మే నెలలో ఇప్పటివరకు నమో దైన మొత్తం వర్షపాతం 295మిల్లీమీటర్లు.ఇది గడిచిన 107 సంవత్సరాలలో మే నెలలో నమోదైన అత్యధిక వర్షపాతం కావడం గమనార్హం.ఇంతకు ముందు 1918 వ సంవత్సరంలో మే నెలలో 279.4 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డవ్వగా,ఆ శతాబ్దపు రికార్డు ఇప్పుడు కనుమరుగైంది.ఈ అసాధారణ వర్షపాతం ముంబై నగరవాసులను ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇక సోమవారం పొద్దున 11 గంటలకే బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) పరిధిలోని చాలా ప్రాంతాలు 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతంతో తడిసి ముద్దయ్యాయి.ముఖ్యంగా దక్షిణ ముంబయిపై వరుణుడు ప్రతాపం చూపించాడు. నారిమన్‌ పాయింట్‌ స్టేషన్‌ లో అత్యధికంగా 252 మి.మీ., బైకుల్లా ఈ-వార్డు లో 213 మి.మీ.,చారిత్రక కొలాబా ప్రాంతంలో 207 మి.మీ.,డు టకి స్టేషన్‌లో 202 మి.మీ.చొప్పున రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కాబడింది.మెరైన్ లైన్స్‌,చందన్‌వాడీ,మెమోన్‌వాడ,వర్లీ వంటి ప్రాంతాలు కూడా 170 మి.మీ. పైబడిన వర్షపాతంతో ముంబై నగరంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి