హైదరాబాద్, జూలై 1: పసిడి ప్రేమికులకు మంచి వార్త. గత పది రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. జూన్ 22వ తేదీ నుంచి హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కరోజు కూడా పెరగలేదు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయం అని నిపుణులు సూచిస్తున్నారు.
అంతర్జాతీయంగా ప్రభావితం చేసిన అంశాలు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై మృదుత్వ ధోరణి తదితర అంశాలు బంగారం ధరల తగ్గుదలకు దోహదం చేశాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్సుకు స్పాట్ గోల్డ్ ధర $2316 వద్ద ట్రేడవుతుండగా, స్పాట్ సిల్వర్ $35.88 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, రూపాయి విలువ పుంజుకుంటూ డాలర్తో పోలిస్తే ₹85.47 వద్ద ఉంది.
హైదరాబాద్లో బంగారం రేట్లు (జూలై 1 ఉదయం 8 గంటల వరకూ)
- 24 క్యారెట్ల బంగారం: తులానికి ₹160 తగ్గి ₹97,260కి చేరుకుంది
- 22 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు ₹150 తగ్గి ₹89,150కి పడిపోయింది
గత పది రోజుల్లో 24 క్యారెట్ల బంగారం తులానికి సుమారు ₹3,500 మేర తగ్గినట్లు బులియన్ డీలర్లు చెబుతున్నారు.
వెండి రేట్లు కూడా పడిపోతున్నాయి
బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా క్రమంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.100 తగ్గి ₹1,07,700 వద్ద ట్రేడవుతోంది. కొన్ని రోజుల క్రితం వెండి ధర కిలోకి ₹1.20 లక్షలు దాటిన సంగతి తెలిసిందే. దీని వలన వెండి కొనుగోలు చేసిన వారు నిరాశకు లోనవుతున్నారు.
కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం
పసిడి, వెండి ధరలు మళ్లీ పెరగకముందే కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మధ్యాహ్నానికి ధరలు మారే అవకాశం ఉన్నందున లైవ్ రేట్లు పరిశీలించడంలోనే మేలని చెబుతున్నారు. అలాగే పన్నులు, మేకింగ్ చార్జీలు ప్రకారంగా ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి.



