ఆంధ్రప్రదేశ్ లో జూన్ 1వ తేదీ నుండి రేషన్ సరుకులను స్థానిక రేషన్ దుకాణాల నుండే రేషన్ కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయనుంది ప్రభుత్వం.ఇందుకుగాను ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ. అలాగే పేదలకు ఇస్తున్న ఈ రేషన్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం.అయితే పేదల నుండి రేషన్ అందలేదు అనే మాట ఎక్కడా వినిపించరాదని వారికి అందాల్సిన రేషన్ సరుకులు రేషన్ దుకాణాల్లో పొందడానికి రేషన్ ఇచ్చే తేదీలు,సమ యాలను ప్రభుత్వం ప్రకటించింది.
వీటి ప్రకారం ఇకపై ప్రస్తుతం రేషన్ పంపిణీ చేస్తున్న వాహనాలు అదృశ్యం కాబోతున్నాయని సమాచారం.ఆ వాహనాల స్ధానంలో ప్రభుత్వం తిరిగి రేషన్ దుకాణాల వద్దే పేదలకు రేషన్ పంపిణీ చేయబోతున్నారు.ఇందు
కోసం రేషన్ షాపులు ఏ తేదీలతో తెరిచిఉంటాయి, అవి ఎప్పటి నుండి ఏ సమయం వరకు ఓపెన్ చేసి ఉంటాయనే ఈ సమాచారాన్ని కూడా ఇప్పటికే ప్రకటించింది. అయితే,జూన్ నెల నుంచి బియ్యం రేషన్ కార్డు దారులు సరుకులు తీసుకోవాల్సి ఉంటుందని, ఇక ఆ తేదీ,సమయాలు దాటిపోతే రేషన్ సరుకులు తీసుకోవడం కార్డుదారులకు ఇబ్బందులు ఉంటాయని కూడా తెలియజేస్తుంది ప్రభుత్వం.అందువల్ల రేషన్ కార్డు దారులు జూన్ నెల 1వ తేదీ నుండి కొత్తగా రేషన్ షాపుల్లో రేషన్ ఇవ్వబోయే తేదీలు, సమయాల్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల్లో జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ పేదలైన రేషన్ కార్డు దారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.అంతే కాదు ఆయా రోజుల్లో రేషన్ పంపిణీ చేసే సమయాల్ని కూడా వెల్లడించింది. దీని ప్రకారం నిర్ణయించిన ఆ 15రోజుల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వేళ 12 గంటల సమయం వరకు మరియు సాయంత్రం వేళ 4 గంటల నుండి రాత్రి వేళ 8 గంటల వరకూ లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం.ఇలా కేటాయించబడిన తేదీల్లో, నిర్ణయించబడిన సమయాలలో మాత్రమే రేషన్ పంపిణీ ఉండబోతున్నట్లు తెలుస్తుంది.