అమరావతి:సుమారు 15కోట్లతో అమరావతి రాజధాని గ్రామం నిడమర్రు జెడ్పి హైస్కూల్ ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే తొలి మోడల్ స్కూల్ ఏర్పాటుకు నిర్మాణ పనులు చాలా వేగవంతం గా జరుగుతున్నాయి. ఆధునాతన సౌకర్యాలతో భవనాలు,గ్రౌండ్ పనులు జరుగుతున్నాయి.
అగస్త్య ఫౌండషన్ ఆధ్వర్యంలో సైన్స్ ల్యాబ్ & పార్క్ నిర్మాణం ఇక్కడ ఉన్నాయి.మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐ.టి, మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో పాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అభివృద్ధికి మంత్రి కట్టుబడి ఉన్నారనేది ఈ పనులు చూస్తుంటే అర్ధమవుతుంది.రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ ప్రతిపాదనలతో రాజధాని అమరావతిలొని మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పి హైస్కూల్ ను రాష్ట్రంలొనే తొలి మోడల్ స్కూల్ గా ఎంపిక చేశారు.ఇక నిడమర్రులో అంతర్జాతీయ ప్రమాణాల తో తొలి మోడల్ స్కూల్ కు ఆంకురార్పణ జరిగింది.
సుమారు 15 కోట్ల రూపాయలతో నిడమర్రు జెడ్పి హైస్కూల్ ప్రాంగణంలో అభివృద్ది పనులు వేగ వంతంగా కొనసాగుతున్నాయి. ఆధునికతను జొడించి,ఆధునాతన సౌకర్యాలతో భవనాలు, గ్రౌండ్ నిర్మాణాలు ఇక్కడ చేపట్టనున్నారు.రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మార్క్ చూపిస్తూ ఆయన ఆధ్వర్యంలో అభివృద్ది పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.