ఎలాన్ మస్క్ స్టార్లింక్కు భారత టెలికాం శాఖ నుంచి కీలకమైనటువంటి అనుమతులు లభించిన ట్లు తెలుస్తోంది.ఇక భారత్ లో శాటిలైట్ ఆధారంగా నెట్ సేవలకు క్లియరెన్స్ వచ్చినట్లేనని తెలుస్తుం ది.ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో మారుమూ ల గ్రామాలు,ఎత్తయిన కొండ ప్రాంతాలకు ఈ సేవలు చాలా ప్రయోజన కరంగా ఉండనున్నాయి. మన దేశంలో ఈ స్టార్ లింక్ సేవలకు కొద్దిరోజులు సమయం పడుతుందని సమాచారం.ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఎలాన్ మస్క్కు చెందిన ఈ స్టార్లింక్ సంస్థ,భారత దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారం భించే దిశగా కీలక అడుగు వేసింది.కొద్దిరోజుల ముందు టెలికమ్యూ నికేషన్స్ విభాగం నుండి అవసరమైన అనుమతు లను పొందడం జరిగింది. దీంతో దేశంలో అతి త్వర లోనే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఏపీ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.ఇప్పటికే రిలయన్స్ జియో సంస్థ, భారతీ ఎయిర్టెల్కు చెందిన వన్వెబ్,వంటివి
కూడా ఇలాంటి అనుమతు లు సాధించాయి.ఈ నేపథ్యంలో ‘స్టార్లింక్’ సేవల ధరలు ఎలా ఉండబోతున్నాయనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తి స్తోంది.
స్టార్లింక్ ఇప్పటికే 100కు పైగా పలు దేశాల్లో తన సేవలను విస్తరింపజేసింది. బంగ్లాదేశ్ వంటి దేశాలలో హార్డ్ వేర్ ధరలు 30వేలకు పైగా ధర నిర్ణయిస్తే, నెలవారీ 3వేలు గల ప్లాన్ ఒకటి మంచిగా ఉన్నట్లు పలు మీడియా కథనాల ద్వారా తెలుస్తున్న సమాచారం.అలాగే
భారతదేశంలో కూడా సరాసరి అవే ధరలు అమలుకాబడే అవకాశం ఉందని ఆ ఛానల్ కథనం ద్వారా వెల్లడించింది అనే ప్రచారం ఉంది.
ఈ స్టార్ లింక్ సేవలు ప్రధానంగా ఫైబర్ నెట్వర్క్ అందుబాటులోలేని,టెలికాం సిగ్నళ్లు సరిగా అందనటువంటి ఊరు శివారు గ్రామాలు,ఎత్తైన కొండ ప్రాంతాల్లో నివసించే వారికి ఈ స్టార్లింక్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక స్టార్ లింక్ సేవలు టెక్నికల్ పరంగా చూసుకుంటే ఇండియాలో ప్రారంభానికి మరికొంత సమయం అనగా మరో ఏడాది సమయం పట్టవచ్చని అంచనాలు ఉన్నాయి.