సహజంగా మనకు విషపూరితమైన జాతులకు సంబంధించి మాట్లాడు కోవాల్సివస్తే మొట్ట మొదటిగా ఠక్కున గుర్తుకు వచ్చేది పాములు, తేళ్లు,జెర్రులు ఇవి చాలా ప్రమాదకరమని మనందరికీ తెలుసు.అయితే దీనికి ప్రధాన కారణం ఏమంటే వాటిలో విషం ఉండటమే.. అలాంటి భయంకరమైన వాటిలో పలురకాల కీటకాలు ఉన్నాయి.ఇక తేళ్లు విషయానికి వస్తే విశ్వ వ్యాప్తంగా వీటిలో మొత్తం 1500కు పైగా జాతులు ఉన్నట్లు సమాచారం. అయితే ప్రధానంగా 8 రకాల జాతుల తేళ్ళు బాగా విషపూరితమై ఉన్నాయి.
మనం చెప్పుముంటున్న ఈ విషపూరితమైన తేళ్లు లో మరో విచిత్రమైన తేలు జాతి ఒకటి ఉంది.ఈ జాతి తేళ్లు ప్రవర్తన వేరుగా ఉంటుంది.అదే “మార్కా టాక్సిన్” తేళ్లు.సహజంగా తేలు కరిస్తే,మనిషికి సాధా రణంగా ప్రాణాపాయం ఉండదు.అయితే విపరీత మైన నొప్పి అనేది ఉంటుంది.ఇక మనం చెప్పుకుంటు న్న తేళ్లుజాతి మధ్య,దక్షిణ అమెరికాల్లో నివసించే మార్కాటాక్సిన్ తేళ్లు మాత్రం అత్యంత ప్రమాదకరమైనవని తెలుస్తుంది. వీటి విషంతో వైద్యం కూడా చేస్తున్నారట.కొత్త రక్తకణాల ఏర్పాటుకు,గుండె బైపాస్ శస్త్రచికిత్సకి ఉపయోగించే విషయంపై పరిశోధనలు చేస్తున్నారు.అయితే ఏ వాతావరణంలోనైనా జీవించగల ఈ తేలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆహారం తిని బ్రతికేస్తుంది.ఆహారం అందుబాటులో లేనియెడల దాని జీర్ణక్రియ మందగిస్తుంది.తేలు విషం నుంచి మందులు తయారు చేస్తారు.ఈ తేలు విషానికి మన వ్యాధులను నయం చేసే శక్తి,గుణం దానికి ఉంది. అందుకే ఈ తేలు విషానికి చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఒక గ్రాము తేలు విషం 80,000/- రూపాయల వరకు మార్కెట్లో అమ్ముడు పోతుంది.అంటే లీటరు తేలు విషం ధరకి వస్తే రూ. 80 కోట్లు.ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన,ఖరీ దైన విషంగా ప్రత్యేకఖ్యాతిని కలిగి ఉంది.అందుకే టర్కీలోని ప్రయోగశాలల లో తేళ్లను పెంచుతున్నారు.ఈ తేలు ఆకారం వింతగా ఉండటమే కాదు..దీని జీవన విధానం కూడా వింతగా ఉంటుందని ముందే చెప్పుకున్నాం కదా…!
ఇక్కడే ఓ ఆశ్చర్యకరమైన విషయం ఉంది.ఈమార్కా టాక్సిన్ జాతికి చెందిన ఆడ తేలు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో తేలు పిల్లలకు జన్మనిస్తుంది.ఈ తేలు పిల్లలు పుట్టిన వెనువెంటనే తల్లి భుజం మీదకు ఎక్కడం జరుగుతుంది. తన పిల్లలని మోస్తున్న తల్లికి,ఆ తేలు పిల్లలు వేసే శిక్ష చదవడానికి,వినడానికి కొంత ఆశ్చర్యంతో కూడిన భయం మనలో వస్తుంది.ఈ పిల్ల తేళ్లు పుట్టిన కొద్ది సేపటిలోనే తల్లి తేలు మీదకు ఎక్కిన పిల్ల తేళ్లు,తల్లి మాంసాన్ని తినడం మొదలు పెడతాయి అంటే…ఆశ్చర్యం కదా…మరి,అవును ఇది నిజం.తల్లి మరణించే వరకు అలా అవి ఆతల్లి శరీరాన్ని తింటూనే ఉంటాయట…!ఈ పిల్ల తేళ్ళు.తల్లి వాటికి ఆహారంగా మారిపోయి వాటికి జీవం పోస్తుంది. ఒక విషపుజీవిలో పిల్లల ఆహారం కోసం శరీరాన్ని అర్పించి వాటికి ఆహారం గా మారిపోవడం చూస్తే ఇదికదా…!తల్లిప్రేమ అనిపిస్తుంది. ఇలా జరగడానికి కారణం ఏదైనా కావచ్చు.అదే ప్రకృతిలోని జీవుల జీవన ధర్మం అని మనిషి తెలుసు కోగలిగితే….ఇందులో చాలా అర్ధం ఉంది.