టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అనూహ్య ఘనత సాధించాడు. ఒకే టెస్ట్ మ్యాచ్లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆసియా వికెట్ కీపర్గా ఆయన నిలిచాడు. టెస్టుల 148 ఏళ్ల చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే చోటు చేసుకున్న అరుదైన ఘట్టం కావడం విశేషం. అంతేకాదు, ఈ ఫీట్ సాధించిన ప్రపంచంలో రెండో వికెట్ కీపర్గా రిషభ్ పంత్ చరిత్రలోకి అడుగుపెట్టాడు.
ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో పంత్ ఈ ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులు చేసిన ఆయన, రెండో ఇన్నింగ్స్లో మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచి కేవలం 129 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్లో ఆత్మవిశ్వాసం, దూకుడు, టెక్నిక్ల సమ్మేళనం స్పష్టంగా కనిపించాయి. ఈ ప్రదర్శనతో పంత్ టెస్ట్ క్రికెట్లో అత్యంత విశ్వసనీయమైన వికెట్ కీపర్-బాట్స్మెన్లలో ఒకడిగా నిలిచాడు.
ఈ అరుదైన రికార్డు గతంలో కేవలం ఒకసారి మాత్రమే నమోదైంది. జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ ఆండీ ఫ్లవర్ 2000లో భారత్తో నాగ్పూర్లో జరిగిన టెస్ట్లో ఇదే ఫీట్ను సాధించాడు. అప్పట్లో ఆండీ ఫ్లవర్ తొలి ఇన్నింగ్స్లో 232 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో 102 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ వికెట్ కీపర్ కూడా ఈ ఘనతను అందుకోలేకపోయారు.
ఇప్పటికే పంత్ తన టెస్ట్ కెరీర్లో ఎనిమిది సెంచరీలు నమోదు చేశాడు. భారత క్రికెట్ చరిత్రలో టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్గా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. అతని దూకుడు, ఆటపై పట్టుదల, ముఖ్య సమయాల్లో నిలిచే నైపుణ్యం భారత జట్టుకు మరింత బలాన్ని ఇస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అనూహ్య ఘనత సాధించాడు. ఒకే టెస్ట్ మ్యాచ్లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆసియా వికెట్ కీపర్గా ఆయన నిలిచాడు. టెస్టుల 148 ఏళ్ల చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే చోటు చేసుకున్న అరుదైన ఘట్టం కావడం విశేషం. అంతేకాదు, ఈ ఫీట్ సాధించిన ప్రపంచంలో రెండో వికెట్ కీపర్గా రిషభ్ పంత్ చరిత్రలోకి అడుగుపెట్టాడు.
ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో పంత్ ఈ ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులు చేసిన ఆయన, రెండో ఇన్నింగ్స్లో మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచి కేవలం 129 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్లో ఆత్మవిశ్వాసం, దూకుడు, టెక్నిక్ల సమ్మేళనం స్పష్టంగా కనిపించాయి. ఈ ప్రదర్శనతో పంత్ టెస్ట్ క్రికెట్లో అత్యంత విశ్వసనీయమైన వికెట్ కీపర్-బాట్స్మెన్లలో ఒకడిగా నిలిచాడు.
ఈ అరుదైన రికార్డు గతంలో కేవలం ఒకసారి మాత్రమే నమోదైంది. జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ ఆండీ ఫ్లవర్ 2000లో భారత్తో నాగ్పూర్లో జరిగిన టెస్ట్లో ఇదే ఫీట్ను సాధించాడు. అప్పట్లో ఆండీ ఫ్లవర్ తొలి ఇన్నింగ్స్లో 232 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో 102 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ వికెట్ కీపర్ కూడా ఈ ఘనతను అందుకోలేకపోయారు.
ఇప్పటికే పంత్ తన టెస్ట్ కెరీర్లో ఎనిమిది సెంచరీలు నమోదు చేశాడు. భారత క్రికెట్ చరిత్రలో టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్గా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. అతని దూకుడు, ఆటపై పట్టుదల, ముఖ్య సమయాల్లో నిలిచే నైపుణ్యం భారత జట్టుకు మరింత బలాన్ని ఇస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.