ఏడాదికి ఒకసారి కరోనా మనల్ని కొత్త,కొత్త వేరియంట్స్ తో పలకరిస్తుంది.2019లో కరోనా యావత్ ప్రపంచాన్ని హడలెత్తించింది.ఆ దెబ్బకు కరోనా అనే పేరు వింటేనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.అయితే కొవిడ్-19 తరువాత ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేరియంట్స్ వస్తూనే ఉన్నాయి,పోతూనే ఉన్నాయి.2019లో వచ్చిన కరోనా తీవ్రత ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియంట్స్ ద్వారా కనిపించలేదు.అయినా సరే అప్పట్లో మనం కనిపించని ప్రమాదకరమైన శత్రువుతో పోరాటం చేసాం.ఇది మనందరికీ బాగా తెలిసిన గుర్తుండిపోయిన విషయం.మళ్ళా విదేశాలతో పాటు దేశంలో కరోనా కేసులు గుర్తించి అటువంటి పరిస్థితి వస్తుందేమోనని మన కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దేశ ప్రజలను అప్రమత్తం చేస్తుంది.ప్రజలు కూడా భయపడకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు పలు సూచనలు చేస్తుంది.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు మరియు విమానాశ్రయాల లో కొవిడ్-19 నియమాలను పాటించాలని సూచించింది.కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మరోసారి అధికారులను అప్రమత్తం చేసింది.
మరి ముఖ్యంగా ప్రార్థనా మందిరాలు,సామాజిక సమావేశాలు,పార్టీలు మరియు కార్యక్రమాలు వంటి అన్ని సామూహిక సమావేశాలను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది.రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు మరియు విమానాశ్రయాలలో కొవిడ్-19 నియమాలను పాటించాలని సూచించింది.వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు ఇంటి లోపలే ఉండాలని, పరిశుభ్రత పాటించాలని, తరచుగా చేతులు కడుక్కోవాలని మరియు దగ్గు మరియు తుమ్ముల ను నివారించాలని సూచించింది.అదేవిధంగా, రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్లు ధరించాలని మరియు కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాల ని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ప్రజలకు తెలిపింది.కొవిడ్ ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణించిన వారు ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.
జ్వరం, జలుబు, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం,తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, వికారం,వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది.అనారోగ్యం గా ఉంటే ప్రజలు ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వ ఆరోగ్య శాఖ సూచించింది.
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ అన్ని ఆసుపత్రులకు మాస్క్లు,పి.పి.ఈ కిట్లు మరియు ట్రిపుల్ లేయర్ మాస్క్లను అన్ని సమయాల్లో ల్యాబ్లలో తగినంతగా ఉంచాలని సూచించింది