కుప్పం మహిళ శిరీషతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.

అమరావతి: కుప్పం మహిళ శిరీషను సోమవారం ఫోన్‌లో పరామర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకతీస్తూ ఆమె పిల్లల చదువుకు హామీ ఇచ్చారు. తన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని ధైర్యంగా ఉండాలని ఆమెకు సీఎం భరోసా ఇచ్చారు.

చిత్తూరు జిల్లా ,కుప్పం, మండలం,నారాయణ పురం గ్రామంలో అప్పు తీర్చ లేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఫోన్‌లో మాట్లాడి శిరీషను పరామర్శించి,ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదుర య్యాయా అని అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని ఆమె చెప్పారు.ఈ ఘటనలో పిల్లలు,తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రి కి బాధితురాలు గోడు వెళ్ల బోసుకుంది.

ఇటువంటి ఘటన దురదృష్ణకరమని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశారు.మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని సిఎం అన్నారు.శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు.వారిని బాగా చదివించాని సూచించారు.ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని….ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు.అప్పుల బాధ,ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిరీష పరిస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి,అప్పటి కప్పుడు ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని శిరీషకు ఫోన్‌లో సిఎం హామీ ఇచ్చారు.

ఘటన,తదనంతర పరిణామాలపై తనకు నివేదిక ఇవ్వాలని,బాధిత కుటుంబానికి అందుబాటులో ఉండి అవసరమైన సాయం పూర్తిగా అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి